జననాయక్ కర్పూరీ ఠాకూర్ జయంతి వేడుకలు ఏలూరు జిల్లా చాట్రాయి లో ఘనంగా నిర్వహణ
జననాయక్ కర్పూరీ ఠాకూర్ జయంతి వేడుకలు ఏలూరు జిల్లా చాట్రాయి లో ఘనంగా నిర్వహణ
GADDAM JAGANMOHAN REDDY
చా ట్రాయి జనవరి 24(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయిలో సామాజిక న్యాయ పోరాట యోధుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, భారత రత్న కర్పూరీ ఠాకూర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ ఏలూరు జిల్లా ఓబీసీ మోర్చా కోశాధికారి ఆదిమూలం నాగమోహన్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కర్పూరీ ఠాకూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదిమూలం నాగమోహన్ శర్మ మాట్లాడుతూ
అణగారిన వర్గాల ఆశాజ్యోతి సమాజంలో వెనుకబడిన, దళిత, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు కర్పూరీ ఠాకూర్ అని కొనియాడారు.ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'భారత రత్న' ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.సామాన్య కుటుంబంలో పుట్టి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఆయన జీవితం నేటి తరం నాయకులకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు ఇజ్జగిరి నరసింహ రావు, ఆదిములం హేమంత్, బొర్రాశేఖర్, మరియు గ్రామ ప్రముఖులు పాల్గొని కర్పూరీ ఠాకూర్ కి నివాళులర్పించారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి