Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:00 PM

జననాయక్ కర్పూరీ ఠాకూర్ జయంతి వేడుకలు ఏలూరు జిల్లా చాట్రాయి లో ఘనంగా నిర్వహణ

జననాయక్ కర్పూరీ ఠాకూర్ జయంతి వేడుకలు ఏలూరు జిల్లా చాట్రాయి లో ఘనంగా నిర్వహణ

జననాయక్ కర్పూరీ ఠాకూర్ జయంతి వేడుకలు ఏలూరు జిల్లా చాట్రాయి లో ఘనంగా నిర్వహణ
January 24, 2026 02:25 PM 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చా ట్రాయి జనవరి 24(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయిలో సామాజిక న్యాయ పోరాట యోధుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, భారత రత్న కర్పూరీ ఠాకూర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ ఏలూరు జిల్లా ఓబీసీ మోర్చా కోశాధికారి ఆదిమూలం నాగమోహన్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కర్పూరీ ఠాకూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదిమూలం నాగమోహన్ శర్మ మాట్లాడుతూ

అణగారిన వర్గాల ఆశాజ్యోతి సమాజంలో వెనుకబడిన, దళిత, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు కర్పూరీ ఠాకూర్ అని కొనియాడారు.ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'భారత రత్న' ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.సామాన్య కుటుంబంలో పుట్టి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఆయన జీవితం నేటి తరం నాయకులకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు ఇజ్జగిరి నరసింహ రావు, ఆదిములం హేమంత్, బొర్రాశేఖర్, మరియు గ్రామ ప్రముఖులు పాల్గొని కర్పూరీ ఠాకూర్ కి నివాళులర్పించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News