Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:41 AM

జనకళ్యాణ్ దివస్ కార్యక్రమం

జనకళ్యాణ్ దివస్ కార్యక్రమం

జనకళ్యాణ్ దివస్ కార్యక్రమం
January 16, 2026 09:00 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు గంధమల్ల లింగస్వామి అధ్యక్షతన"జనకళ్యాణ్ దివస్ కార్యక్రమం" సందర్భంగా బిఎస్ పీ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్టేట్ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్ హాజరై మాట్లాడుతూ...బిఎస్ పీ అధినేత్రి యూపీ మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి గారి జన్మదినం బహుజనులకు పండుగ రోజు మా దశ దిశ మాయావతి అన్నారు. బెహన్ జీ అయ్యాక 3 నెలల్లో 7 లక్షల ఎకరాలు పట్టా చేసి పంపిణీ చేసిందన్నారు. షాదీ ముబారక్,బీసీ లకు రేషన్ పంపిణీలో 27శాతం రిజర్వేషన్ల కేటాయింపు, ఆడపిల్లలకు వాహనాలు,కాన్షీరాం గారి పేరుతో హాస్పిటల్ పెట్టడం,మహనీయలతో జిల్లాల ఏర్పాటు,అశోకుని వలె ప్రేరణ కలిగించేలా 2 వేల ఎకరాలతో ప్రేరణ స్థలం, గౌతమ బుద్ధ యూనివర్సిటీ అత్యద్భుతమైన రోడ్డు రవాణా,లా అండ్ ఆర్డర్ కంట్రోల్ యూపీ ప్రజల పైన ఎలాంటి దాడులు జరుగకుండా చేసిందన్నారు. తన ప్రభుత్వం లో క్రిమినల్స్ ని జైలులో వేసి కట్టుదిట్టమైన పాలన అందించిందన్నారు.తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ విద్యా వైద్యం ఉచితంగా అందిస్తామని, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తాం అని అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో బిఎస్ పీ పార్టీని గెలిపించాలని పట్టణాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల శ్రీకాంత్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుదాస్,జోనల్ ఇంచార్జి లు దయాకర్ మౌర్య, బొడ్డు కిరణ్,కత్తుల కాన్షీరాం,కోనేటి సుజాత,భువనగిరి, సికింద్రాబాద్,నల్గొండ,సూర్యాపేట జిల్లా ఇంచార్జి లు,నల్గొండ జిల్లా అధ్యక్షుడు రావుల పాటి రవిశంకర్,ఎర్ర రాంబాబు, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు బండారి శ్రీనివాస్,నియోజకవర్గ ఇంచార్జి లు,నియోజకవర్గ అధ్యక్షులు మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News