జనగణన వివరాలు పూర్తిగా గోప్యం – కలెక్టర్ ప్రతీక్ జైన్
జనగణన వివరాలు పూర్తిగా గోప్యం – కలెక్టర్ ప్రతీక్ జైన్
Krishna
జనగణన ప్రతి పౌరుడి బాధ్యత అని, సమగ్ర మరియు ఖచ్చితమైన సమాచారం దేశాభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మంగళవారం జిల్లా కలెక్టరేట్ నుంచి ఐబీ వరకు నిర్వహించిన “జనగణన అవగాహన మారథాన్ వాక్” కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మే 10 వరకు స్వీయ గణన నిర్వహించగా, మే 11 నుంచి ఇంటింటి గణన ప్రారంభమైందన్నారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని, వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేశామని తెలిపారు. ప్రజలు జనగణన సిబ్బందికి సహకరించి సరైన వివరాలు అందించాలని కోరారు. జనగణనలో సేకరించే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని స్పష్టం చేశారు. ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఏర్పడి, సంక్షేమ పథకాల రూపకల్పన మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలుకు జనగణన గణాంకాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం బాధ్యతగా పాల్గొని జనగణన విజయవంతానికి సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు సంగీత, పాండు, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, వివిధ శాఖల అధికారులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, తహసీల్దార్లు, ఎన్యూమరేటర్లు, ఆశా వర్కర్లు, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి