Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:54 AM

జనగామలో తండ్రీకొడుకుల ఆత్మహత్య కలకలం. ఆలయ కోనేరులో దూకి బలవన్మరణం

జనగామలో తండ్రీకొడుకుల ఆత్మహత్య కలకలం. ఆలయ కోనేరులో దూకి బలవన్మరణం

జనగామలో తండ్రీకొడుకుల ఆత్మహత్య కలకలం. ఆలయ కోనేరులో దూకి బలవన్మరణం
23-05-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మనోవేదన, ఆర్థిక ఇబ్బందులతోనే ఘటన?

జనగామ జిల్లాలో తండ్రీకొడుకుల ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బండగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్న లక్ష్మీనరసింహాచార్యులు, ఆయన కుమారుడు పవన్‌కుమార్ ఆచార్యులు ఆలయ కోనేరులో పడి మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. నెల రోజుల క్రితం భార్య మృతి చెందడంతో లక్ష్మీనరసింహాచార్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని, ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడుతున్న నేపథ్యంలో ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటనాస్థలాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్ పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు

Sthanikam

జనగామలో తండ్రీకొడుకుల ఆత్మహత్య కలకలం. ఆలయ కోనేరులో దూకి బలవన్మరణం

Article Image

మనోవేదన, ఆర్థిక ఇబ్బందులతోనే ఘటన?

జనగామ జిల్లాలో తండ్రీకొడుకుల ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బండగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్న లక్ష్మీనరసింహాచార్యులు, ఆయన కుమారుడు పవన్‌కుమార్ ఆచార్యులు ఆలయ కోనేరులో పడి మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. నెల రోజుల క్రితం భార్య మృతి చెందడంతో లక్ష్మీనరసింహాచార్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని, ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడుతున్న నేపథ్యంలో ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటనాస్థలాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్ పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News