మనోవేదన, ఆర్థిక ఇబ్బందులతోనే ఘటన?
జనగామ జిల్లాలో తండ్రీకొడుకుల ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బండగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్న లక్ష్మీనరసింహాచార్యులు, ఆయన కుమారుడు పవన్కుమార్ ఆచార్యులు ఆలయ కోనేరులో పడి మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. నెల రోజుల క్రితం భార్య మృతి చెందడంతో లక్ష్మీనరసింహాచార్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని, ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడుతున్న నేపథ్యంలో ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘటనాస్థలాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్ పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి