Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:47 PM

జాన్ పహాడ్ ఉరుసుకు ప్రత్యేక బస్సు సేవలు

జాన్ పహాడ్ ఉరుసుకు ప్రత్యేక బస్సు సేవలు

జాన్ పహాడ్ ఉరుసుకు ప్రత్యేక బస్సు సేవలు
January 22, 2026 09:07 AM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

భక్తుల సౌకర్యార్థం కోదాడ డిపో చర్యలు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా ఉరుసు సందర్భంగా భక్తుల ప్రయాణ సౌకర్యార్థం కోదాడ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సు సేవలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ ప్రత్యేక బస్సు సేవలు జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. నేరేడుచర్ల నుంచి జాన్ పహాడ్ దర్గా వరకు ప్రతి ఇరవై నిమిషాలకు ఒక బస్సు చొప్పున నడపనున్నట్లు తెలిపారు.

భక్తులకు అందుబాటులో ఉండేలా చార్జీలను తక్కువగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. పెద్దలకు యాభై రూపాయలు, పిల్లలకు ముప్పై రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. జాన్ పహాడ్ ఉరుసుకు వచ్చే భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే ఈ ప్రత్యేక బస్సు సేవల ప్రధాన ఉద్దేశమని కోదాడ డిపో అధికారులు తెలిపారు.భక్తులు అధిక సంఖ్యలో ఈ ప్రత్యేక బస్సు సేవలను వినియోగించి, ఈ సేవలను విజయవంతం చేయాలని అధికారులు కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News