జాన్ పహాడ్ ఉరుసుకు ప్రత్యేక బస్సు సేవలు
జాన్ పహాడ్ ఉరుసుకు ప్రత్యేక బస్సు సేవలు
Biksham
భక్తుల సౌకర్యార్థం కోదాడ డిపో చర్యలు
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా ఉరుసు సందర్భంగా భక్తుల ప్రయాణ సౌకర్యార్థం కోదాడ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సు సేవలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ ప్రత్యేక బస్సు సేవలు జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. నేరేడుచర్ల నుంచి జాన్ పహాడ్ దర్గా వరకు ప్రతి ఇరవై నిమిషాలకు ఒక బస్సు చొప్పున నడపనున్నట్లు తెలిపారు.
భక్తులకు అందుబాటులో ఉండేలా చార్జీలను తక్కువగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. పెద్దలకు యాభై రూపాయలు, పిల్లలకు ముప్పై రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. జాన్ పహాడ్ ఉరుసుకు వచ్చే భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే ఈ ప్రత్యేక బస్సు సేవల ప్రధాన ఉద్దేశమని కోదాడ డిపో అధికారులు తెలిపారు.భక్తులు అధిక సంఖ్యలో ఈ ప్రత్యేక బస్సు సేవలను వినియోగించి, ఈ సేవలను విజయవంతం చేయాలని అధికారులు కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి