జంగారెడ్డిగూడెంలో మంచినీటి పైప్ లైన్ పనులను ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్
జంగారెడ్డిగూడెంలో మంచినీటి పైప్ లైన్ పనులను ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్
GADDAM JAGANMOHAN REDDY
జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి జంగారెడ్డిగూడెం పట్టణంలోని 25 వ వార్డు కొడూరు ఎస్టేట్ కాలనీలో మంచినీటి సరఫరా మెరుగుకై మంగళవారం నూతన బోరి బావితోపాటు నూతన పైప్ లైన్ పనులు పూర్తి చేసుకున్న అనంతరం మంచినీటి సదుపాయాన్ని ప్రజలకు అంకితం చేస్తూ చింతలపూడి ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచినీటి సరఫరా శాశ్వత పరిష్కారానికి చేపట్టిన పైప్ లైన్ పనుల నాణ్యత ప్రమాణాలతో చేపట్టడంఋ జరిగిందని రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పట్టణంలో ఎక్కడ కూడా మంచినీటి కొరత ఉండకుండా చూడాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అధికారులకు సూచించారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కూటమి నాయకులు వార్డు కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి