Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:53 PM

జలధార’తో నీటి సంరక్షణకు వందరోజుల కార్యాచరణ

జలధార’తో నీటి సంరక్షణకు వందరోజుల కార్యాచరణ

జలధార’తో నీటి సంరక్షణకు వందరోజుల కార్యాచరణ
April 07, 2026 07:27 PM 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి/సోమందేపల్లి : రాష్ట్రంలో నీటి సంరక్షణకు ‘జలధార’ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. సోమందేపల్లి మండలం చాలకూరు గ్రామ సమీపంలోని చెరువులో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

వంద రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో చెరువులు, సాగునీటి కాలువల్లో పూడికతీతలు, మరమ్మతులు, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టి భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యమన్నారు. ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు రైతులు, సాగునీటి సంఘాల భాగస్వామ్యంతో కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. తక్కువ నీటితో ఎక్కువ పంట పండించే డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.

జలధార కార్యక్రమం అనంతరం మంత్రి వేరుశెనగ పంట పొలాలను పరిశీలించి రైతులతో ముచ్చటించారు. పంటల పరిస్థితి, దిగుబడిపై వివరాలు తెలుసుకుని రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

అమరావతి అంశంపై వైసీపీ నేతల వైఖరిని ఆమె విమర్శిస్తూ, మీడియా సంస్థలు, ప్రజలపై దాడులు గర్హనీయమని హెచ్చరించారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News