Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోంగార్డ్ కుటుంబానికి రూ. 34 లక్షల బీమా చెక్కు చోలేమరి జాతరలో పాల్గొన్న మంత్రి సవిత “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” దారులేసిన దార్శనికుడు ఫూలే: బహుజన ఉద్యమాల మూలస్తంభం జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 07, 2026 09:07 PM

జలధార’తో నీటి సంరక్షణకు వందరోజుల కార్యాచరణ

జలధార’తో నీటి సంరక్షణకు వందరోజుల కార్యాచరణ

జలధార’తో నీటి సంరక్షణకు వందరోజుల కార్యాచరణ
April 07, 2026 07:27 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి/సోమందేపల్లి : రాష్ట్రంలో నీటి సంరక్షణకు ‘జలధార’ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. సోమందేపల్లి మండలం చాలకూరు గ్రామ సమీపంలోని చెరువులో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

వంద రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో చెరువులు, సాగునీటి కాలువల్లో పూడికతీతలు, మరమ్మతులు, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టి భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యమన్నారు. ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు రైతులు, సాగునీటి సంఘాల భాగస్వామ్యంతో కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. తక్కువ నీటితో ఎక్కువ పంట పండించే డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.

జలధార కార్యక్రమం అనంతరం మంత్రి వేరుశెనగ పంట పొలాలను పరిశీలించి రైతులతో ముచ్చటించారు. పంటల పరిస్థితి, దిగుబడిపై వివరాలు తెలుసుకుని రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

అమరావతి అంశంపై వైసీపీ నేతల వైఖరిని ఆమె విమర్శిస్తూ, మీడియా సంస్థలు, ప్రజలపై దాడులు గర్హనీయమని హెచ్చరించారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News