శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గంలోని పెనుకొండ మండలం ఆడదాకులపల్లి గ్రామంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు జౌళి శాఖ మంత్రి సవితమ్మ సూచనలతో “మన ఊరు - మన నీరు - జలధార” కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు.
ఈ సందర్భంగా “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత”పై అధికారులు గ్రామస్థులకు అవగాహన కల్పించారు. నీటి వనరుల సంరక్షణ, సమర్థ వినియోగం, సాగునీటి సంఘాల పాత్రపై వివరణ ఇచ్చారు.
ఈ గ్రామసభలో పెనుకొండ మండలం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఈశ్వర ప్రసాద్, స్పెషల్ ఆఫీసర్, ఇరిగేషన్ ఏఈ, పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో, ఏపీవో, వర్క్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, రైతులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి