Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:37 PM

జిల్లాలో యూరియా కొరత లేదు – కలెక్టర్ స్పష్టం

జిల్లాలో యూరియా కొరత లేదు – కలెక్టర్ స్పష్టం

జిల్లాలో యూరియా కొరత లేదు – కలెక్టర్ స్పష్టం
December 29, 2025 05:15 PM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యూరియా సరిపోతుంది… రైతులకు కలెక్టర్ భరోసా

యాదాద్రి స్థానికం ప్రతినిధి

యూరియా కొరతపై జిల్లాలో నెలకొన్న అపోహలకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పష్టమైన తెరదించారు. సాగుకు అవసరమైన యూరియా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం జిల్లాలో 6,191 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, ఇప్పటివరకు మొత్తం 15,611 మెట్రిక్ టన్నుల యూరియాను జిల్లాకు సరఫరా చేసినట్లు తెలిపారు. సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సరఫరాలు కూడా క్రమం తప్పకుండా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతి సేల్ కౌంటర్ వద్ద షామియానా, త్రాగునీటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 6 గంటల నుంచే యూరియా విక్రయాలు ప్రారంభించాలని సూచించారు.

యూరియా పంపిణీపై వ్యవసాయ శాఖ, సంబంధిత అధికారులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

యూరియా సరఫరాలో ఎలాంటి సమస్యలు ఎదురైనా రైతులు వెంటనే సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. అవసరానికి మించి నిల్వ చేసుకోకుండా, శాస్త్రీయ పద్ధతిలో వినియోగించుకోవాలని రైతులకు కలెక్టర్ సూచన చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News