Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:20 AM

జిల్లాలో యూరియా కొరత లేదు – కలెక్టర్ స్పష్టం

జిల్లాలో యూరియా కొరత లేదు – కలెక్టర్ స్పష్టం

జిల్లాలో యూరియా కొరత లేదు – కలెక్టర్ స్పష్టం
December 29, 2025 05:15 PM 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

యూరియా సరిపోతుంది… రైతులకు కలెక్టర్ భరోసా

యాదాద్రి స్థానికం ప్రతినిధి

యూరియా కొరతపై జిల్లాలో నెలకొన్న అపోహలకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పష్టమైన తెరదించారు. సాగుకు అవసరమైన యూరియా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం జిల్లాలో 6,191 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, ఇప్పటివరకు మొత్తం 15,611 మెట్రిక్ టన్నుల యూరియాను జిల్లాకు సరఫరా చేసినట్లు తెలిపారు. సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సరఫరాలు కూడా క్రమం తప్పకుండా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతి సేల్ కౌంటర్ వద్ద షామియానా, త్రాగునీటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 6 గంటల నుంచే యూరియా విక్రయాలు ప్రారంభించాలని సూచించారు.

యూరియా పంపిణీపై వ్యవసాయ శాఖ, సంబంధిత అధికారులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

యూరియా సరఫరాలో ఎలాంటి సమస్యలు ఎదురైనా రైతులు వెంటనే సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. అవసరానికి మించి నిల్వ చేసుకోకుండా, శాస్త్రీయ పద్ధతిలో వినియోగించుకోవాలని రైతులకు కలెక్టర్ సూచన చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News