Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:48 AM

జిల్లాలో యూరియా కొరత లేదు – కలెక్టర్ స్పష్టం

జిల్లాలో యూరియా కొరత లేదు – కలెక్టర్ స్పష్టం

జిల్లాలో యూరియా కొరత లేదు – కలెక్టర్ స్పష్టం
29-12-2025 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యూరియా సరిపోతుంది… రైతులకు కలెక్టర్ భరోసా

యాదాద్రి స్థానికం ప్రతినిధి

యూరియా కొరతపై జిల్లాలో నెలకొన్న అపోహలకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పష్టమైన తెరదించారు. సాగుకు అవసరమైన యూరియా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం జిల్లాలో 6,191 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, ఇప్పటివరకు మొత్తం 15,611 మెట్రిక్ టన్నుల యూరియాను జిల్లాకు సరఫరా చేసినట్లు తెలిపారు. సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సరఫరాలు కూడా క్రమం తప్పకుండా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతి సేల్ కౌంటర్ వద్ద షామియానా, త్రాగునీటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 6 గంటల నుంచే యూరియా విక్రయాలు ప్రారంభించాలని సూచించారు.

యూరియా పంపిణీపై వ్యవసాయ శాఖ, సంబంధిత అధికారులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

యూరియా సరఫరాలో ఎలాంటి సమస్యలు ఎదురైనా రైతులు వెంటనే సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. అవసరానికి మించి నిల్వ చేసుకోకుండా, శాస్త్రీయ పద్ధతిలో వినియోగించుకోవాలని రైతులకు కలెక్టర్ సూచన చేశారు.

Sthanikam

జిల్లాలో యూరియా కొరత లేదు – కలెక్టర్ స్పష్టం

Article Image

యూరియా సరిపోతుంది… రైతులకు కలెక్టర్ భరోసా

యాదాద్రి స్థానికం ప్రతినిధి

యూరియా కొరతపై జిల్లాలో నెలకొన్న అపోహలకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పష్టమైన తెరదించారు. సాగుకు అవసరమైన యూరియా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం జిల్లాలో 6,191 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, ఇప్పటివరకు మొత్తం 15,611 మెట్రిక్ టన్నుల యూరియాను జిల్లాకు సరఫరా చేసినట్లు తెలిపారు. సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సరఫరాలు కూడా క్రమం తప్పకుండా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతి సేల్ కౌంటర్ వద్ద షామియానా, త్రాగునీటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 6 గంటల నుంచే యూరియా విక్రయాలు ప్రారంభించాలని సూచించారు.

యూరియా పంపిణీపై వ్యవసాయ శాఖ, సంబంధిత అధికారులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

యూరియా సరఫరాలో ఎలాంటి సమస్యలు ఎదురైనా రైతులు వెంటనే సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. అవసరానికి మించి నిల్వ చేసుకోకుండా, శాస్త్రీయ పద్ధతిలో వినియోగించుకోవాలని రైతులకు కలెక్టర్ సూచన చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News