Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:01 AM

జిల్లా సైన్స్ ఫేర్‌లో క్రిష్ణవేణి విద్యార్థుల ప్రతిభ… రాష్ట్ర స్థాయికి ఎంపిక

జిల్లా సైన్స్ ఫేర్‌లో క్రిష్ణవేణి విద్యార్థుల ప్రతిభ… రాష్ట్ర స్థాయికి ఎంపిక

జిల్లా సైన్స్ ఫేర్‌లో క్రిష్ణవేణి విద్యార్థుల ప్రతిభ… రాష్ట్ర స్థాయికి ఎంపిక
23-12-2025 188 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లా సైన్స్ ఫేర్‌లో క్రిష్ణవేణి విద్యార్థుల సత్తా

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

జిల్లా స్థాయి సైన్స్ ఫేర్‌లో రామన్నపేట క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు ప్రతిభను చాటుకున్నారు. వలిగొండ మండల కేంద్రంలో గత రెండు రోజులుగా నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్‌లో పాల్గొన్న క్రిష్ణవేణి విద్యార్థులు అత్యుత్తమ ప్రాజెక్టులతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకుని జిల్లా స్థాయి ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించడంతో పాటు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.

గ్రీన్ ఎనర్జీ జూనియర్ విభాగంలో వి. శరణ్ తేజ్ జిల్లా స్థాయి ప్రథమ బహుమతి సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి తెలిపారు. సస్టైనబుల్ అగ్రికల్చర్ విభాగంలో బి. ప్రణీత్ రెడ్డి జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి పొందగా, హెల్త్ అండ్ హైజిన్ సీనియర్ విభాగంలో జి. లిఖిత జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి సాధించింది. అలాగే వెస్ట్ టు వెల్త్ విభాగంలో ఏ. మాళవిక, ఎన్. అన్షు శ్రీలు జిల్లా స్థాయి ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు.

జిల్లా స్థాయి విజేతలకు జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ తమ చేతుల మీదుగా మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు.

జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, వారికి మార్గనిర్దేశం చేసిన గైడ్ టీచర్ మురళిని పాఠశాల ప్రిన్సిపాల్ బి. యాదగిరి, డైరెక్టర్ జెవిఎన్‌ఎస్ మణి, ఉపాధ్యాయ బృందం అభినందించింది.

Sthanikam

జిల్లా సైన్స్ ఫేర్‌లో క్రిష్ణవేణి విద్యార్థుల ప్రతిభ… రాష్ట్ర స్థాయికి ఎంపిక

Article Image

జిల్లా సైన్స్ ఫేర్‌లో క్రిష్ణవేణి విద్యార్థుల సత్తా

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

జిల్లా స్థాయి సైన్స్ ఫేర్‌లో రామన్నపేట క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు ప్రతిభను చాటుకున్నారు. వలిగొండ మండల కేంద్రంలో గత రెండు రోజులుగా నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్‌లో పాల్గొన్న క్రిష్ణవేణి విద్యార్థులు అత్యుత్తమ ప్రాజెక్టులతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకుని జిల్లా స్థాయి ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించడంతో పాటు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.

గ్రీన్ ఎనర్జీ జూనియర్ విభాగంలో వి. శరణ్ తేజ్ జిల్లా స్థాయి ప్రథమ బహుమతి సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి తెలిపారు. సస్టైనబుల్ అగ్రికల్చర్ విభాగంలో బి. ప్రణీత్ రెడ్డి జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి పొందగా, హెల్త్ అండ్ హైజిన్ సీనియర్ విభాగంలో జి. లిఖిత జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి సాధించింది. అలాగే వెస్ట్ టు వెల్త్ విభాగంలో ఏ. మాళవిక, ఎన్. అన్షు శ్రీలు జిల్లా స్థాయి ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు.

జిల్లా స్థాయి విజేతలకు జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ తమ చేతుల మీదుగా మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు.

జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, వారికి మార్గనిర్దేశం చేసిన గైడ్ టీచర్ మురళిని పాఠశాల ప్రిన్సిపాల్ బి. యాదగిరి, డైరెక్టర్ జెవిఎన్‌ఎస్ మణి, ఉపాధ్యాయ బృందం అభినందించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News