Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:25 AM

జిల్లా సైన్స్ ఫేర్‌లో క్రిష్ణవేణి విద్యార్థుల ప్రతిభ… రాష్ట్ర స్థాయికి ఎంపిక

జిల్లా సైన్స్ ఫేర్‌లో క్రిష్ణవేణి విద్యార్థుల ప్రతిభ… రాష్ట్ర స్థాయికి ఎంపిక

జిల్లా సైన్స్ ఫేర్‌లో క్రిష్ణవేణి విద్యార్థుల ప్రతిభ… రాష్ట్ర స్థాయికి ఎంపిక
December 23, 2025 07:14 PM 165 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లా సైన్స్ ఫేర్‌లో క్రిష్ణవేణి విద్యార్థుల సత్తా

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

జిల్లా స్థాయి సైన్స్ ఫేర్‌లో రామన్నపేట క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు ప్రతిభను చాటుకున్నారు. వలిగొండ మండల కేంద్రంలో గత రెండు రోజులుగా నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్‌లో పాల్గొన్న క్రిష్ణవేణి విద్యార్థులు అత్యుత్తమ ప్రాజెక్టులతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకుని జిల్లా స్థాయి ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించడంతో పాటు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.

గ్రీన్ ఎనర్జీ జూనియర్ విభాగంలో వి. శరణ్ తేజ్ జిల్లా స్థాయి ప్రథమ బహుమతి సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి తెలిపారు. సస్టైనబుల్ అగ్రికల్చర్ విభాగంలో బి. ప్రణీత్ రెడ్డి జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి పొందగా, హెల్త్ అండ్ హైజిన్ సీనియర్ విభాగంలో జి. లిఖిత జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి సాధించింది. అలాగే వెస్ట్ టు వెల్త్ విభాగంలో ఏ. మాళవిక, ఎన్. అన్షు శ్రీలు జిల్లా స్థాయి ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు.

జిల్లా స్థాయి విజేతలకు జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ తమ చేతుల మీదుగా మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు.

జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, వారికి మార్గనిర్దేశం చేసిన గైడ్ టీచర్ మురళిని పాఠశాల ప్రిన్సిపాల్ బి. యాదగిరి, డైరెక్టర్ జెవిఎన్‌ఎస్ మణి, ఉపాధ్యాయ బృందం అభినందించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News