న్యాయ–పాలన అంశాలపై చర్చ
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట జిల్లా కోర్టు భవనంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి (డిస్ట్రిక్ట్ జడ్జి) లక్ష్మీ శారదను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో న్యాయవ్యవస్థకు సంబంధించిన పలు కీలక అంశాలు, న్యాయ విభాగం–పాలన మధ్య సమన్వయం, ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించే అంశాలపై వారు విస్తృతంగా చర్చించుకున్నారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల అమలులో న్యాయ విభాగం అందిస్తున్న సహకారంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తికి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, పాలనలో న్యాయ విభాగం కీలక పాత్ర పోషిస్తోందని, భవిష్యత్తులో కూడా ఇదే సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి