Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:19 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్
07-01-2026 12,582 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

న్యాయ–పాలన అంశాలపై చర్చ

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట జిల్లా కోర్టు భవనంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి (డిస్ట్రిక్ట్ జడ్జి) లక్ష్మీ శారదను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో న్యాయవ్యవస్థకు సంబంధించిన పలు కీలక అంశాలు, న్యాయ విభాగం–పాలన మధ్య సమన్వయం, ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించే అంశాలపై వారు విస్తృతంగా చర్చించుకున్నారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల అమలులో న్యాయ విభాగం అందిస్తున్న సహకారంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తికి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, పాలనలో న్యాయ విభాగం కీలక పాత్ర పోషిస్తోందని, భవిష్యత్తులో కూడా ఇదే సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు.

Sthanikam

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్

Article Image

న్యాయ–పాలన అంశాలపై చర్చ

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట జిల్లా కోర్టు భవనంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి (డిస్ట్రిక్ట్ జడ్జి) లక్ష్మీ శారదను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో న్యాయవ్యవస్థకు సంబంధించిన పలు కీలక అంశాలు, న్యాయ విభాగం–పాలన మధ్య సమన్వయం, ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించే అంశాలపై వారు విస్తృతంగా చర్చించుకున్నారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల అమలులో న్యాయ విభాగం అందిస్తున్న సహకారంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తికి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, పాలనలో న్యాయ విభాగం కీలక పాత్ర పోషిస్తోందని, భవిష్యత్తులో కూడా ఇదే సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 21 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News