జిల్లా ఎస్పీ ఆదేశాలతో క్యాబ్ డ్రైవర్లపై ఫోకస్ రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం
జిల్లా ఎస్పీ ఆదేశాలతో క్యాబ్ డ్రైవర్లపై ఫోకస్ రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం
Biksham
క్యాబ్ డ్రైవర్లకు రోడ్డు భద్రతల గురించి సూచిస్తున్న సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం
సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో క్యాబ్ డ్రైవర్లను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో బుధవారం జరిగింది. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్యాబ్ డ్రైవర్లు, విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం మాట్లాడుతూ, క్యాబ్ డ్రైవర్లు ప్రతిరోజూ అనేకమంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయాల్సిన బాధ్యత కలిగి ఉన్నారని తెలిపారు. అందువల్ల ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని, వేగ నియంత్రణ పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. అలాగే వాహనాల ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో క్యాబ్ డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి