Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్ పెనుకొండలో బీసీ విద్యార్థులకు వరం.. కొత్తగా 3 హాస్టళ్లు మంజూరు బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 09, 2026 08:08 AM

జైకేసారంలో పశువుల పునరుత్పత్తి ఉత్పాదకత శిబిరం

జైకేసారంలో పశువుల పునరుత్పత్తి ఉత్పాదకత శిబిరం

జైకేసారంలో పశువుల పునరుత్పత్తి ఉత్పాదకత శిబిరం
May 08, 2026 08:35 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రైతులకు ఉచిత వైద్య సేవలు.. 75 శాతం సబ్సిడీతో పశుగ్రాస విత్తనాల పంపిణీ

చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువుల పునరుత్పత్తి ఉత్పాదకత శిబిరం (కాటిల్ ఫెర్టిలిటీ క్యాంప్) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, గ్రామ సర్పంచ్ సమ్మిరెడ్డి భారతమ్మ జనార్ధన్ రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.శిబిరంలో ఆవులు, గేదెలకు పశువైద్యాధికారులు గర్భకోశ పరీక్షలు నిర్వహించి రైతులకు అవసరమైన ఉచిత మందులను పంపిణీ చేశారు. దూడలకు నట్టల నివారణ మందులు వేయడంతో పాటు వాటి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ‘కాఫ్ ర్యాలీ’ నిర్వహించారు.పాడి పరిశ్రమ అభివృద్ధి దిశగా రైతులకు 75 శాతం సబ్సిడీతో పశుగ్రాస విత్తనాలను అందజేశారు. వేసవి కాలంలో పశువుల సంరక్షణ, పోషణ, తాగునీటి నిర్వహణపై పశువైద్యాధికారులు రైతులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో మిల్క్ సొసైటీ చైర్మన్ దిల్లి శేఖర్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ బోదాసు స్వాతి వెంకటేష్, పశువైద్యాధికారులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ పృథ్వీరాజ్, వార్డు సభ్యులు బిమిడి రజిత సందీప్, వార్డు సభ్యులు, పశువైద్య సిబ్బంది, జైకేసారం గ్రామానికి చెందిన పాడి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News