Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తండ్రి ఆశయాలకు నిలువెత్తు నివాళిగా గ్రామంలో సిమెంట్ కుర్చీల ఏర్పాటు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 05:44 PM

జైకేసారంలో పశువుల పునరుత్పత్తి ఉత్పాదకత శిబిరం

జైకేసారంలో పశువుల పునరుత్పత్తి ఉత్పాదకత శిబిరం

జైకేసారంలో పశువుల పునరుత్పత్తి ఉత్పాదకత శిబిరం
May 08, 2026 08:35 PM 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రైతులకు ఉచిత వైద్య సేవలు.. 75 శాతం సబ్సిడీతో పశుగ్రాస విత్తనాల పంపిణీ

చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువుల పునరుత్పత్తి ఉత్పాదకత శిబిరం (కాటిల్ ఫెర్టిలిటీ క్యాంప్) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, గ్రామ సర్పంచ్ సమ్మిరెడ్డి భారతమ్మ జనార్ధన్ రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.శిబిరంలో ఆవులు, గేదెలకు పశువైద్యాధికారులు గర్భకోశ పరీక్షలు నిర్వహించి రైతులకు అవసరమైన ఉచిత మందులను పంపిణీ చేశారు. దూడలకు నట్టల నివారణ మందులు వేయడంతో పాటు వాటి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ‘కాఫ్ ర్యాలీ’ నిర్వహించారు.పాడి పరిశ్రమ అభివృద్ధి దిశగా రైతులకు 75 శాతం సబ్సిడీతో పశుగ్రాస విత్తనాలను అందజేశారు. వేసవి కాలంలో పశువుల సంరక్షణ, పోషణ, తాగునీటి నిర్వహణపై పశువైద్యాధికారులు రైతులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో మిల్క్ సొసైటీ చైర్మన్ దిల్లి శేఖర్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ బోదాసు స్వాతి వెంకటేష్, పశువైద్యాధికారులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ పృథ్వీరాజ్, వార్డు సభ్యులు బిమిడి రజిత సందీప్, వార్డు సభ్యులు, పశువైద్య సిబ్బంది, జైకేసారం గ్రామానికి చెందిన పాడి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News