Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 12:49 AM

జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అధికారం – నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అధికారం – నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అధికారం – నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
February 17, 2026 08:27 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 37 వార్డులకు గాను బిఆర్ స్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 3, ఎంఐఎం 2, ముగ్గురు స్వతంత్రులు గెలుపొందారు. అనంతరం ఎంఐఎం, స్వతంత్ర కౌన్సిలర్ల మద్దతు కాంగ్రెస్‌కు లభించడంతో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ విజయవంతమైంది. ఈ క్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ యూనుస్ మున్సిపల్ ఛైర్మన్‌గా, 16వ వార్డు కౌన్సిలర్ కొత్తకాపు శిరీష రెడ్డి వైస్ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్డీవో దేవుజా సమక్షంలో నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన ఛైర్మన్ యూనుస్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News