Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్. సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 10:52 AM

జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అధికారం – నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అధికారం – నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అధికారం – నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
February 17, 2026 08:27 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 37 వార్డులకు గాను బిఆర్ స్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 3, ఎంఐఎం 2, ముగ్గురు స్వతంత్రులు గెలుపొందారు. అనంతరం ఎంఐఎం, స్వతంత్ర కౌన్సిలర్ల మద్దతు కాంగ్రెస్‌కు లభించడంతో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ విజయవంతమైంది. ఈ క్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ యూనుస్ మున్సిపల్ ఛైర్మన్‌గా, 16వ వార్డు కౌన్సిలర్ కొత్తకాపు శిరీష రెడ్డి వైస్ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్డీవో దేవుజా సమక్షంలో నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన ఛైర్మన్ యూనుస్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News