Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:04 AM

జహీరాబాద్‌లో అసదుద్దీన్ ఓవైసీ ప్రచార పాదయాత్ర

జహీరాబాద్‌లో అసదుద్దీన్ ఓవైసీ ప్రచార పాదయాత్ర

జహీరాబాద్‌లో అసదుద్దీన్ ఓవైసీ ప్రచార పాదయాత్ర
09-02-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

మజ్లిస్ అభ్యర్థులకు భారీ మెజారిటీతో గెలుపు కోరిన ఎంఐఎం అధినేత

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ పట్టణంలో ఆదివారం ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విస్తృతంగా పర్యటించారు. పట్టణంలోని శాంతినగర్‌తో పాటు పలు వార్డుల్లో ఆయన పాదయాత్ర నిర్వహించి, ఎంఐఎం అభ్యర్థుల తరఫున ప్రజలను ఓట్ల కోసం అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జహీరాబాద్ పట్టణంలో నెలకొన్న తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ, పేదల సంక్షేమం వంటి స్థానిక సమస్యల పరిష్కారం ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అభ్యర్థులతోనే సాధ్యమని పేర్కొన్నారు. మజ్లిస్ పార్టీ ప్రజల సమస్యలను ఎప్పుడూ పట్టించుకుంటూ, అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, పట్టణ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. పాదయాత్రలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది.

Sthanikam

జహీరాబాద్‌లో అసదుద్దీన్ ఓవైసీ ప్రచార పాదయాత్ర

Article Image

మజ్లిస్ అభ్యర్థులకు భారీ మెజారిటీతో గెలుపు కోరిన ఎంఐఎం అధినేత

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ పట్టణంలో ఆదివారం ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విస్తృతంగా పర్యటించారు. పట్టణంలోని శాంతినగర్‌తో పాటు పలు వార్డుల్లో ఆయన పాదయాత్ర నిర్వహించి, ఎంఐఎం అభ్యర్థుల తరఫున ప్రజలను ఓట్ల కోసం అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జహీరాబాద్ పట్టణంలో నెలకొన్న తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ, పేదల సంక్షేమం వంటి స్థానిక సమస్యల పరిష్కారం ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అభ్యర్థులతోనే సాధ్యమని పేర్కొన్నారు. మజ్లిస్ పార్టీ ప్రజల సమస్యలను ఎప్పుడూ పట్టించుకుంటూ, అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, పట్టణ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. పాదయాత్రలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News