జహీరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ ప్రచార పాదయాత్ర
జహీరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ ప్రచార పాదయాత్ర
Reporter Sangameshwar Reddy
మజ్లిస్ అభ్యర్థులకు భారీ మెజారిటీతో గెలుపు కోరిన ఎంఐఎం అధినేత
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ పట్టణంలో ఆదివారం ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విస్తృతంగా పర్యటించారు. పట్టణంలోని శాంతినగర్తో పాటు పలు వార్డుల్లో ఆయన పాదయాత్ర నిర్వహించి, ఎంఐఎం అభ్యర్థుల తరఫున ప్రజలను ఓట్ల కోసం అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జహీరాబాద్ పట్టణంలో నెలకొన్న తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ, పేదల సంక్షేమం వంటి స్థానిక సమస్యల పరిష్కారం ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అభ్యర్థులతోనే సాధ్యమని పేర్కొన్నారు. మజ్లిస్ పార్టీ ప్రజల సమస్యలను ఎప్పుడూ పట్టించుకుంటూ, అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, పట్టణ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. పాదయాత్రలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి