జహీరాబాద్లో భవాని మాత మహాయజ్ఞం
జహీరాబాద్లో భవాని మాత మహాయజ్ఞం
Editor Desk
జహీరాబాద్ స్థానిక ప్రతినిధి
లోకకల్యాణార్థం జహీరాబాద్ పట్టణంలోని హోతి (కె ) శివారులోని సత్వార్ గుండెరావు జామతోటలో వెలసిన శ్రీ భవాని మాత, మహేశ్వరి మాత ఆలయంలో శనివారం నాడు కుడుంబల్ ఆయి సంకల్పించిన భవాని మాత మహాయజ్ఞం అత్యంత శోభాయమానంగా జరిగింది. పుష్య మాసం శుద్ధ పౌర్ణమి సందర్బంగా స్థానిక వేదబ్రాహ్మణోత్తములు శ్రీ వేణు భట్ మహారాజ్ ఆధ్వర్యంలో ఈ మహా యజ్ఞం జరిగింది. ఆలయ పూజారి శ్రీమంత్, జగదాంబలతో వేద మంత్ర ఉచ్చారణలతో యజ్ఞ క్రతువులు నిర్వహించారు. ఈ సందర్భంగా తీర్థ ప్రసాదాలతో పాటు భక్తులకు మహా అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ మహా యజ్ఞ క్రతువులో శివాజీ జాదవ్, స్థానిక పద్మశాలి సంఘం అధ్యక్షులు గడ్డం జనార్దన్, అప్పం ప్రభు, దార మధు, ఎన్నం రఘు, బెజగం సత్యనారాయణ, హరిపాల్, లక్ష్మయ్య,నాగరాజ్, సంతోష్, నర్సింహారెడ్డి, తాండూర్ హరి, మెదక్ సుధాకర్, మాణిక్యం, మల్లేష్లతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వార్త హెడ్డింగ్ మంచిగా కావాలి
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి