Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:55 AM

జగన్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు: కొల్లు రవీంద్ర

జగన్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు: కొల్లు రవీంద్ర

జగన్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు: కొల్లు రవీంద్ర
May 21, 2026 08:11 PM 111 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కర్నూలు: ప్రజలు 11 సీట్లు ఇచ్చి ఇంటికి పంపినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఖరిలో మార్పు రాలేదని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు బీవీ జయనాగేశ్వరరెడ్డి, గౌరు చరితారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తోందని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంతో ప్రజల్లో ప్రభుత్వానికి ఆదరణ పెరిగిందన్నారు. ఆ అభివృద్ధిని చూసి జగన్ జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

అమరావతి, పోలవరం, రాయలసీమ ప్రాజెక్టులను జగన్ నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగరాజు యాదవ్, రాఘవేంద్రరెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News