Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:04 PM

జగన్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు: కొల్లు రవీంద్ర

జగన్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు: కొల్లు రవీంద్ర

జగన్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు: కొల్లు రవీంద్ర
May 21, 2026 08:11 PM 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కర్నూలు: ప్రజలు 11 సీట్లు ఇచ్చి ఇంటికి పంపినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఖరిలో మార్పు రాలేదని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు బీవీ జయనాగేశ్వరరెడ్డి, గౌరు చరితారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తోందని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంతో ప్రజల్లో ప్రభుత్వానికి ఆదరణ పెరిగిందన్నారు. ఆ అభివృద్ధిని చూసి జగన్ జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

అమరావతి, పోలవరం, రాయలసీమ ప్రాజెక్టులను జగన్ నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగరాజు యాదవ్, రాఘవేంద్రరెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News