జగన్కు ఇంకా అహంకారం తగ్గలేదు: కొల్లు రవీంద్ర
జగన్కు ఇంకా అహంకారం తగ్గలేదు: కొల్లు రవీంద్ర
Editor Desk
కర్నూలు: ప్రజలు 11 సీట్లు ఇచ్చి ఇంటికి పంపినా వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఖరిలో మార్పు రాలేదని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు బీవీ జయనాగేశ్వరరెడ్డి, గౌరు చరితారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తోందని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంతో ప్రజల్లో ప్రభుత్వానికి ఆదరణ పెరిగిందన్నారు. ఆ అభివృద్ధిని చూసి జగన్ జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
అమరావతి, పోలవరం, రాయలసీమ ప్రాజెక్టులను జగన్ నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు.
కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగరాజు యాదవ్, రాఘవేంద్రరెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి