PRINT TIME: July 11, 2026 01:42 AM
జగదీశ్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్, హరీష్ రావు
జగదీశ్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్, హరీష్ రావు
January 23, 2026 09:47 AM
41 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పరామర్శించారు.ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అవసరమైన వైద్య చికిత్స అందిస్తున్నామని వైద్యులు వివరించారు. జగదీశ్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కేటీఆర్, హరీష్ రావు ఆకాంక్షించారు. పార్టీ శ్రేణులు, నాయకులు కూడా ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి