జగదాంబ సేవాలాల్ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం – ఎమ్మెల్యే
జగదాంబ సేవాలాల్ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం – ఎమ్మెల్యే
Krishna
కొండాపూర్ మండలం శివన్న గూడెం తండాలోని జగదాంబ సేవాలాల్ ఆలయ 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు తండా ప్రజలు, యువకులు లంబాడ సంప్రదాయ వస్త్రధారణలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో లంబాడ సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా తండాలోని తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో తండా ప్రజలు తనకు ఇచ్చిన మద్దతును గుర్తు చేసుకుంటూ తండా అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని తెలిపారు. అలాగే జగదాంబ సేవాలాల్ ఆలయ అభివృద్ధికి కూడా తన వంతు సహాయం అందిస్తానన్నారు. ఆలయ వార్షికోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వినోద్, మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, దేవేందర్, మల్లేశం, వివిధ గ్రామాల సర్పంచ్లు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి