Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
“ఈ సమస్య పరిష్కరించేది ఎప్పుడో...?” “తాత్కాలికం కాదు… శాశ్వత పరిష్కారం సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 08:19 AM

జీవో–252 సవరణకు మద్దతు ఇవ్వాలి: టీయూడబ్ల్యూజే వినతి

జీవో–252 సవరణకు మద్దతు ఇవ్వాలి: టీయూడబ్ల్యూజే వినతి

జీవో–252 సవరణకు మద్దతు ఇవ్వాలి: టీయూడబ్ల్యూజే వినతి
December 31, 2025 04:16 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట: జర్నలిస్టులకు నూతనంగా జారీ చేయనున్న అక్రిడేషన్ కార్డుల ప్రక్రియకు సంబంధించి జారీ చేసిన జీవో నెం.252ను సవరించేందుకు మద్దతు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే (హెచ్–143) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డిని వారి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.


ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, జీవోలోని నిబంధనలను సవరించి న్యాయం చేయాలని కోరారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వజ్జ వీరయ్య యాదవ్‌తో పాటు ఎడ్వర్డ్, శ్యాంసుందర్ రెడ్డి, శేఖర్, సురేష్, బచ్చు పురుషోత్తం, ఊటుకురి రవీందర్, యాకయ్య, ప్రవీణ్, నాగేందర్, రామచారి, పిన్నెల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News