జీవో–252 సవరణకు మద్దతు ఇవ్వాలి: టీయూడబ్ల్యూజే వినతి
జీవో–252 సవరణకు మద్దతు ఇవ్వాలి: టీయూడబ్ల్యూజే వినతి
Biksham
స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట: జర్నలిస్టులకు నూతనంగా జారీ చేయనున్న అక్రిడేషన్ కార్డుల ప్రక్రియకు సంబంధించి జారీ చేసిన జీవో నెం.252ను సవరించేందుకు మద్దతు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే (హెచ్–143) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డిని వారి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, జీవోలోని నిబంధనలను సవరించి న్యాయం చేయాలని కోరారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వజ్జ వీరయ్య యాదవ్తో పాటు ఎడ్వర్డ్, శ్యాంసుందర్ రెడ్డి, శేఖర్, సురేష్, బచ్చు పురుషోత్తం, ఊటుకురి రవీందర్, యాకయ్య, ప్రవీణ్, నాగేందర్, రామచారి, పిన్నెల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి