జాతీయ స్థాయి లక్ష్యంగా ఖమ్మం మహిళల కబడ్డీ జట్టు
జాతీయ స్థాయి లక్ష్యంగా ఖమ్మం మహిళల కబడ్డీ జట్టు
స్థానికం బృందం
జాతీయ స్థాయి లక్ష్యంగా ముందుకు సాగాలి
ఖమ్మం మహిళల కబడ్డీ జట్టును అభినందించిన దయాకర్ రెడ్డి
ఖమ్మం: స్థానికం ప్రతినిధి
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటిన ఖమ్మం జిల్లా మహిళల కబడ్డీ జట్టు మరింత మెరుగైన ఆటతీరుతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి, ఖమ్మం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు తుంబూరు దయాకర్ రెడ్డి ఆకాంక్షించారు.
కరీంనగర్లో ఈ నెల 25 నుంచి 28 వరకు కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 72వ తెలంగాణ రాష్ట్రస్థాయి స్త్రీ, పురుషుల కబడ్డీ పోటీల్లో ఖమ్మం జిల్లా మహిళల జట్టు స్త్రీల విభాగంలో తృతీయ బహుమతి సాధించి కాంస్య పతకం గెలుచుకుంది. ఈ సందర్భంగా సోమవారం మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో జట్టు సభ్యులను దయాకర్ రెడ్డి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రమశిక్షణతో కూడిన శిక్షణ, పట్టుదల ఉంటే ఖమ్మం క్రీడాకారిణులు రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయిలోనూ ప్రతిభను చాటగలరని అన్నారు. ప్రభుత్వం, క్రీడా సంఘాల సహకారంతో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
డీ వై ఎస్ ఓ తుంబూరు సునీల్ రెడ్డి కూడా జట్టు సభ్యులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కటికల క్రిస్టాఫర్ బాబు, జట్టు కోచ్ శివజ్యోతి, మేనేజర్ శ్రీను, కబడ్డీ అసోసియేషన్ సభ్యులు పాల్గొని క్రీడాకారిణులను సన్మానించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి