Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:06 AM

జాతీయ స్థాయి లక్ష్యంగా ఖమ్మం మహిళల కబడ్డీ జట్టు

జాతీయ స్థాయి లక్ష్యంగా ఖమ్మం మహిళల కబడ్డీ జట్టు

జాతీయ స్థాయి లక్ష్యంగా ఖమ్మం మహిళల కబడ్డీ జట్టు
December 29, 2025 06:58 PM 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జాతీయ స్థాయి లక్ష్యంగా ముందుకు సాగాలి

ఖమ్మం మహిళల కబడ్డీ జట్టును అభినందించిన దయాకర్ రెడ్డి

ఖమ్మం: స్థానికం ప్రతినిధి

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటిన ఖమ్మం జిల్లా మహిళల కబడ్డీ జట్టు మరింత మెరుగైన ఆటతీరుతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి, ఖమ్మం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు తుంబూరు దయాకర్ రెడ్డి ఆకాంక్షించారు.

కరీంనగర్‌లో ఈ నెల 25 నుంచి 28 వరకు కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 72వ తెలంగాణ రాష్ట్రస్థాయి స్త్రీ, పురుషుల కబడ్డీ పోటీల్లో ఖమ్మం జిల్లా మహిళల జట్టు స్త్రీల విభాగంలో తృతీయ బహుమతి సాధించి కాంస్య పతకం గెలుచుకుంది. ఈ సందర్భంగా సోమవారం మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో జట్టు సభ్యులను దయాకర్ రెడ్డి అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రమశిక్షణతో కూడిన శిక్షణ, పట్టుదల ఉంటే ఖమ్మం క్రీడాకారిణులు రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయిలోనూ ప్రతిభను చాటగలరని అన్నారు. ప్రభుత్వం, క్రీడా సంఘాల సహకారంతో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

డీ వై ఎస్ ఓ తుంబూరు సునీల్ రెడ్డి కూడా జట్టు సభ్యులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కటికల క్రిస్టాఫర్ బాబు, జట్టు కోచ్ శివజ్యోతి, మేనేజర్ శ్రీను, కబడ్డీ అసోసియేషన్ సభ్యులు పాల్గొని క్రీడాకారిణులను సన్మానించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News