Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:58 AM

జాతీయ లోక్ అదాలత్‌లో నారాయణఖేడ్‌లో 316 కేసులకు పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్‌లో నారాయణఖేడ్‌లో 316 కేసులకు పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్‌లో నారాయణఖేడ్‌లో 316 కేసులకు పరిష్కారం
21-12-2025 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి

నారాయణఖేడ్ పట్టణంలోని మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఖేఢ్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మంథని శ్రీధర్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 316 కేసులకు పరిష్కారం లభించింది.

ఈ సందర్భంగా న్యాయమూర్తి మంథని శ్రీధర్ మాట్లాడుతూ, వీటిలో 316 కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కారమయ్యాయని తెలిపారు. కక్షిదారులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా జాతీయ లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నామని, కోర్టుల భారం తగ్గడంతో పాటు ప్రజలకు సమయం, ఖర్చు ఆదా అవుతుందన్నారు.

రాజీ మార్గంతో వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల ఇరు పక్షాలకు మేలు జరుగుతుందని పేర్కొంటూ, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భోజిరెడ్డి, న్యాయవాదులు మారుతి రెడ్డి సహా పలువురు న్యాయవాదులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

జాతీయ లోక్ అదాలత్‌లో నారాయణఖేడ్‌లో 316 కేసులకు పరిష్కారం

Article Image

స్థానికం ప్రతినిధి

నారాయణఖేడ్ పట్టణంలోని మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఖేఢ్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మంథని శ్రీధర్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 316 కేసులకు పరిష్కారం లభించింది.

ఈ సందర్భంగా న్యాయమూర్తి మంథని శ్రీధర్ మాట్లాడుతూ, వీటిలో 316 కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కారమయ్యాయని తెలిపారు. కక్షిదారులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా జాతీయ లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నామని, కోర్టుల భారం తగ్గడంతో పాటు ప్రజలకు సమయం, ఖర్చు ఆదా అవుతుందన్నారు.

రాజీ మార్గంతో వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల ఇరు పక్షాలకు మేలు జరుగుతుందని పేర్కొంటూ, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భోజిరెడ్డి, న్యాయవాదులు మారుతి రెడ్డి సహా పలువురు న్యాయవాదులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News