జాతీయ లోక్ అదాలత్లో నారాయణఖేడ్లో 316 కేసులకు పరిష్కారం
జాతీయ లోక్ అదాలత్లో నారాయణఖేడ్లో 316 కేసులకు పరిష్కారం
Editor Desk
స్థానికం ప్రతినిధి
నారాయణఖేడ్ పట్టణంలోని మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఖేఢ్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మంథని శ్రీధర్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 316 కేసులకు పరిష్కారం లభించింది.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మంథని శ్రీధర్ మాట్లాడుతూ, వీటిలో 316 కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కారమయ్యాయని తెలిపారు. కక్షిదారులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా జాతీయ లోక్ అదాలత్లను నిర్వహిస్తున్నామని, కోర్టుల భారం తగ్గడంతో పాటు ప్రజలకు సమయం, ఖర్చు ఆదా అవుతుందన్నారు.
రాజీ మార్గంతో వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల ఇరు పక్షాలకు మేలు జరుగుతుందని పేర్కొంటూ, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భోజిరెడ్డి, న్యాయవాదులు మారుతి రెడ్డి సహా పలువురు న్యాయవాదులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి