ఇంటింటి ప్రచారంతో వార్డు పజలను ఆకట్టుకున్న బిఆర్ఎస్ అభ్యర్థి
ఇంటింటి ప్రచారంతో వార్డు పజలను ఆకట్టుకున్న బిఆర్ఎస్ అభ్యర్థి
K.RAVI
2వ వార్డులో కొండమడుగు రవి గెలుపే లక్ష్యంగా ప్రచారం
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా 2వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి కొండమడుగు రవి గెలుపే లక్ష్యంగా పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో రేవణపల్లిలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన వార్డు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజల అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించి వార్డు కౌన్సిలర్ అవకాశం కల్పించాలని కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ 2వ కౌన్సిలర్ కొంగరి కిష్ణ, నక్క రాజు రెడ్డి, మల్లారెడ్డి, కొండమడుగు రోషన్, నూనె మహేష్, ఏనుగు యాదిరెడ్డి, జక్కి కిష్ణ, మునుకుంట్ల బాలచంద్రo గౌడ్, సిదగొని రాజమల్లెష్ గౌడ్, కొండమడుగు మల్లయ్య,బద్ధం చెన్నయ్య, బద్ధం క్రిష్ణ, నూనె సాయి, బూడిద రాజు, యువకులు, మహిళలు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి