ఇంటింటి ప్రచారం నిర్వహించిన 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎండి. హన్నుభాయ్
ఇంటింటి ప్రచారం నిర్వహించిన 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎండి. హన్నుభాయ్
K.RAVI
హన్ను భాయ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించండి
వార్డు ఇంచార్జ్ భీమిడి ప్రదీప్ జి
యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో బంగారుగడ్డ,రత్న నగర్ కాలనీలలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎండి. హన్ను బాయ్ మాజీ కౌన్సిలర్ ఎండి. బాబా షరీఫ్, 20వ వార్డు ఇన్చార్జి ఎస్. లింగోటం గ్రామ సర్పంచ్ ప్రదీప్ జి, వార్డు అధ్యక్షులు ఊడుగు వెంకటేశం తో కలిసి ఇంటింటి ప్రచారమును నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను, గృహజ్యోతి,మహిళలకు ఉచిత బస్ పాస్ సౌకర్యము,ఇందిరమ్మ గృహ నిర్మాణం,కొత్త రేషన్ కార్డులను మొదలైన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ చేపట్టినదని,పదిసంవత్సరముల నుండి ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వని పరిస్థితి గత బిఆర్ఎస్ ప్రభుత్వానిది అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరముల కాలంలో చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ..చెయ్యి గుర్తుపై ఓటు వేసి ఎండి. హన్ను బాయ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భీమిడి ప్రదీప్ జి కోరారు. ఈ కార్యక్రమంలో చోటే బాయ్, గొడుగు శ్రీనివాసు, కొరిమి రమేష్, ఎండి రఫీ,సయ్యద్ వహీదుద్దీన్, ఇబ్రహీం,వెల్తురీ రాజు,ఇబ్రహీం, పరాజ్, ఉడుగు శ్రీకాంత్,ఉడుగు శివ,జోర్రిగల లింగస్వామి, సుంకరీ స్వామి, ఎండి గని, రషీద్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి