ఇంటి వద్దే ఫిర్యాదు.. జిల్లాలో తొలి కేసు నమోదు
ఇంటి వద్దే ఫిర్యాదు.. జిల్లాలో తొలి కేసు నమోదు
Biksham
సూర్యాపేట జిల్లా పోలీసుల వినూత్న కార్యాచరణకు శ్రీకార
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
బాధితుల ఇంటి వద్దకే వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడే కేసు నమోదు చేసే నూతన కార్యాచరణలో భాగంగా సూర్యాపేట జిల్లాలో తొలి కేసును నడిగూడెం పోలీసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. నడిగూడెం మండలం తెల్లబెల్లి గ్రామానికి చెందిన వికలాంగురాలు భూమా రమాదేవి తన భర్త వేధింపులు, కొట్టడం చేస్తున్నాడని డయల్ వందకు ఫోన్ చేయగా, సమాచారం అందుకున్న నడిగూడెం ఎస్ఐ అజయ్ కుమార్ సిబ్బందితో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లారు. అక్కడే ఆమె ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసి, ఫిర్యాదు ప్రతిని బాధితురాలికి అందజేశారు. ఇంటి వద్దే కేసు నమోదు కార్యక్రమం ద్వారా మహిళలు, పిల్లలు, వృద్ధులపై దాడులు, వేధింపులు, దొంగతనాలు, బాల్య వివాహాలు వంటి ఘటనల్లో బాధితులకు భరోసా కలుగుతుందని ఎస్పీ తెలిపారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, బాధితుల ఇంటికే వెళ్లి కేసులు నమోదు చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
జిల్లాలో తొలి కేసు నమోదు చేసిన నడిగూడెం పోలీసులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి