ఇంటి నుంచి వెళ్లి 15 రోజులు… ఇంకా ఆచూకీ లేని యువకుడు
ఇంటి నుంచి వెళ్లి 15 రోజులు… ఇంకా ఆచూకీ లేని యువకుడు
Sthanikam District Staff Reporter krishna
జహీరాబాద్ నియోజకవర్గంలో కోహీర్ మండలం కేంద్రంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి గల్లంతైన విషయం సంబంధించి ఫిర్యాదు అందింది. ఫిర్యాదు వివరాల ప్రకారం, మేతర సామ్యూల్ సన్నాఫ్ యేసయ్య కుమారుడు మేతర రాజు (వయస్సు 35 సంవత్సరాలు) గారు, తన భార్య రాణమ్మతో కుటుంబ సంబంధిత విషయమై 05-02-2026 తేదీన గొడవపడి, ఎవరికి తెలియజేయకుండా ఇంటి నుండి వెళ్లిపోయినట్లు తెలియజేశారు.అప్పటి నుండి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మరియు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా వెతికినా ఆయన జాడ దొరకలేదు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో, కుటుంబ సభ్యులు ఈరోజు పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు నమోదు చేశారు.ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. గల్లంతైన వ్యక్తి గురించి ఏవైనా సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్కు లేదా సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేయగలరు.పోలీసు శాఖ ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి