Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:42 PM

ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలకు సమగ్ర ఏర్పాట్లు

ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలకు సమగ్ర ఏర్పాట్లు

ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలకు సమగ్ర ఏర్పాట్లు
February 23, 2026 08:06 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

శాఖల సమన్వయంతో నిరాటంక నిర్వహణకు చర్యలు : జిల్లా కలెక్టర్

సూర్యాపేట త్వరలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్, పదవ తరగతి వార్షిక పరీక్షలకు అన్ని శాఖలు సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్ సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం పరీక్షల నిర్వహణపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసు, వైద్య, సమాచార, పంచాయతి రాజ్, రవాణా, విద్యుత్తు, ఆర్టీసీ, ట్రెజరి, పోస్టల్, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో ఎటువంటి అంతరాయం కలగకుండా భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రశ్న, జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య మూసివేసిన వాహనాలలో మాత్రమే తరలించాలని సూచించారు. ప్రశ్నాపత్రాల భద్రతకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

జిల్లాలో మొత్తం 69 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పర్యవేక్షణ కోసం ఫ్లైయింగ్ దళాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అదనపు బస్సులు నడపాలని రవాణా అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖను సూచించారు.

పరీక్షా కేంద్రాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్ర వాతావరణం కల్పించాలని పంచాయతి, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

సమావేశంలో అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి భాను నాయక్, జిల్లా పంచాయతి అధికారి యాదగిరి, పోలీసు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News