ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
Sthanikam District Staff Reporter
Telangana State Board of Intermediate Education ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం భువనగిరి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఆధ్వర్యంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులకు శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ అధ్యక్షత వహించగా, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సమగ్రంగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలోని 28 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, సరైన వెలుతురు, ప్రతి తరగతి గదిలో గోడ గడియారాలు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని,జిల్లా పరీక్షల కమిటీ, కన్వీనర్, డిస్ట్రిక్ట్ బల్క్ ఫ్లైయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్లను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి