Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:51 PM

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
February 19, 2026 07:21 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

Telangana State Board of Intermediate Education ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం భువనగిరి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఆధ్వర్యంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులకు శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ అధ్యక్షత వహించగా, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సమగ్రంగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలోని 28 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, సరైన వెలుతురు, ప్రతి తరగతి గదిలో గోడ గడియారాలు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని,జిల్లా పరీక్షల కమిటీ, కన్వీనర్, డిస్ట్రిక్ట్ బల్క్ ఫ్లైయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్‌లను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News