Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:43 AM

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
February 19, 2026 07:21 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

Telangana State Board of Intermediate Education ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం భువనగిరి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఆధ్వర్యంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులకు శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ అధ్యక్షత వహించగా, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సమగ్రంగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలోని 28 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, సరైన వెలుతురు, ప్రతి తరగతి గదిలో గోడ గడియారాలు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని,జిల్లా పరీక్షల కమిటీ, కన్వీనర్, డిస్ట్రిక్ట్ బల్క్ ఫ్లైయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్‌లను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News