ఇంటర్ పరీక్షలకు పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు
ఇంటర్ పరీక్షలకు పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు
Anjali
శ్రీ సత్యసాయి జిల్లాలో సోమవారం నుండి ప్రారంభమైన ఇంటర్ పరీక్షల నేపథ్యంలో పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా పోలీసు అధికారి ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అనధికార వ్యక్తులు తిరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రతి కేంద్రం వద్ద సీఐ స్థాయి అధికారులు, ఎస్ఐలు, పోలీసు సిబ్బందిని నియమించి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పర్యవేక్షిస్తున్నారు.
విద్యార్థులు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రశ్నపత్రాల రవాణాకు భద్రతా పరంగా ప్రత్యేక ఎస్కార్ట్ను ఏర్పాటు చేశారు. కేంద్రాల చుట్టుపక్కల అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసు అధికారి ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఈ భద్రతా చర్యలు పరీక్షల నిర్వహణకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయని అధికారులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి