Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:43 AM

ఇంటర్ పరీక్షలకు పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు

ఇంటర్ పరీక్షలకు పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు

ఇంటర్ పరీక్షలకు పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు
February 23, 2026 04:41 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లాలో సోమవారం నుండి ప్రారంభమైన ఇంటర్ పరీక్షల నేపథ్యంలో పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా పోలీసు అధికారి ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అనధికార వ్యక్తులు తిరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రతి కేంద్రం వద్ద సీఐ స్థాయి అధికారులు, ఎస్ఐలు, పోలీసు సిబ్బందిని నియమించి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పర్యవేక్షిస్తున్నారు.

విద్యార్థులు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రశ్నపత్రాల రవాణాకు భద్రతా పరంగా ప్రత్యేక ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేశారు. కేంద్రాల చుట్టుపక్కల అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసు అధికారి ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.

జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఈ భద్రతా చర్యలు పరీక్షల నిర్వహణకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయని అధికారులు తెలిపారు.




మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News