ఇంటర్ పరీక్షలకు ప్రత్యేక బస్సులు నడపాలి
ఇంటర్ పరీక్షలకు ప్రత్యేక బస్సులు నడపాలి
K.RAVI
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిపో మేనేజర్కు వినతి
ఈనెల 25 నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు సమయానుకూలంగా బస్సు సౌకర్యం కల్పించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) చౌటుప్పల్ మండల కమిటీ ఆధ్వర్యంలో డిపో మేనేజర్కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు దాసరి ప్రకాష్ మాట్లాడుతూ, పల్లెల నుంచి పట్టణాల వరకు పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడకుండా పరీక్షల సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని కోరారు. కొన్ని గ్రామాలకు సరైన బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యేంత వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట్ల అదనపు సర్వీసులు నడపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రధాన రహదారులపై ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సులు కూడా ఆపి విద్యార్థులకు సౌకర్యం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షుడు శ్రావణ్, నాయకులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి