Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:49 PM

ఇటికేపల్లిలో హామీ అమలు చేసిన సర్పంచ్ తమ్మలి రాజు

ఇటికేపల్లిలో హామీ అమలు చేసిన సర్పంచ్ తమ్మలి రాజు

ఇటికేపల్లిలో హామీ అమలు చేసిన సర్పంచ్ తమ్మలి రాజు
January 04, 2026 05:45 PM 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం ఇటికేపల్లి గ్రామ సర్పంచ్ తమ్మలి రాజు స్థానిక ఎన్నికల్లో ఇచ్చిన హామీని కార్యరూపం దాల్చారు. సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామంలో నీటి సమస్య లేకుండా చేస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రెండు వారాలు గడవక ముందే గ్రామంలో బోర్ వేయించి ఆదివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా తమ్మలి రాజు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి భేషజాలకు పోకుండా అందరికీ అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. నీటి సమస్య పరిష్కారంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌కు ధన్యవాదాలు తెలిపారు.బోర్ ప్రారంభోత్సవంలో ఉప సర్పంచ్ ఎర్రోళ్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి, పాంపాడ్ రాజు, పి.ప్రకాశ్, కె.చంద్రశేఖర్, మేత్రి పెంటన్న, మైత్రి విటల్ గొండ, తట్టిపల్లి వీరారెడ్డి, బోజిరెడ్డి పాండురంగారెడ్డి, ఆకుల విఠన్న, దూదేకుల గున్ను మియా, ఆకుల పండారినాథ్, కమ్మరి నర్సింహులు, దూదేకుల హైమద్, పాషామియా, జూకంటి సుభాష్, కె.నాగేశం, పి.అశోక్, ఎస్.సంజీవ్, ఎం.విజయ్, నాగారం దత్తు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News