Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:53 PM

ఇస్లాపురంలో ఇంటింటా సర్వే – సూపర్ సిక్స్ అమలుపై సమీక్ష

ఇస్లాపురంలో ఇంటింటా సర్వే – సూపర్ సిక్స్ అమలుపై సమీక్ష

ఇస్లాపురంలో ఇంటింటా సర్వే – సూపర్ సిక్స్ అమలుపై సమీక్ష
March 25, 2026 09:22 PM 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని 1వ వార్డు ఇస్లాపురం గ్రామంలో మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు సూపర్ సిక్స్ పథకాల అమలుపై ఇంటింటా సర్వే నిర్వహించారు. ప్రజలను నేరుగా కలుసుకుని పథకాల ప్రయోజనాలపై అభిప్రాయాలు సేకరించారు.

మారుతికాలనీ నాగులకట్టలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో స్థానికులు తమ సమస్యలను వెల్లడించారు. వాటిని పరిశీలించిన అధికారులు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా పీఎంఏవై అర్బన్ 2.0 – ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద కొత్త లబ్ధిదారులను గుర్తించారు. ఇంటి పట్టాలకు సంబంధించిన పొజిషన్ సర్టిఫికెట్లకు అర్హులను ఎంపిక చేశారు. సూపర్ సిక్స్ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు.

కార్యక్రమంలో అర్బన్ కన్వీనర్ శ్రీరాములు, కౌన్సిలర్ హనుమంతు, మహిళా అధ్యక్షురాలు రమణమ్మ, చంద్రకాంతమ్మతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News