Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:59 PM

ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేయని వ్యవహారం – కలెక్టర్‌కు కారాగార శిక్ష

ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేయని వ్యవహారం – కలెక్టర్‌కు కారాగార శిక్ష

ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేయని వ్యవహారం – కలెక్టర్‌కు కారాగార శిక్ష
February 18, 2026 08:50 AM 334 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ హై కోర్టు ధిక్కరణను తీవ్రంగా పరిగణిస్తూ, మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు ఆరు నెలల కారాగార శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ అధికారులపై న్యాయస్థాన ఆదేశాలను అమలు చేయకపోతే ఎంత కఠిన చర్యలు తీసుకోబడతాయో ఈ తీర్పు స్పష్టం చేసింది.వివరాల్లోకి వెళ్తే, చేగుంట మండలం పరిధిలోని బోనాల గ్రామంలో భూ వివాదం విషయంలో ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసి, చట్టబద్ధంగా విచారణ నిర్వహించి సమస్యను పరిష్కరించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ ఆదేశాలను అమలు చేయకుండా, తగిన ఆధారాలు లేకుండానే దరఖాస్తును తిరస్కరించడం పట్ల న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.న్యాయమూర్తి కె. లక్ష్మణ్ తన తీర్పులో కలెక్టర్ ఉద్దేశపూర్వకంగానే న్యాయస్థాన ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం చేయడం, న్యాయస్థాన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించడం ప్రతి అధికారికి రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని స్పష్టం చేశారు.సాధారణంగా ధిక్కరణ కేసుల్లో హెచ్చరికలు లేదా జరిమానాలు విధించే సందర్భాలు ఉన్నప్పటికీ, ఈ కేసులో ఆరు నెలల కారాగార శిక్ష విధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది అధికార వ్యవస్థకు గట్టి హెచ్చరికగా భావిస్తున్నారు. న్యాయస్థాన ఆదేశాలు అమలు చేయడం ప్రతి అధికారికి తప్పనిసరి కర్తవ్యమని ఈ తీర్పు మరోసారి రుజువు చేసింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News