Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:13 AM

ఇఫ్తార్ విందుతో మతసామరస్యానికి నిదర్శనం- చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

ఇఫ్తార్ విందుతో మతసామరస్యానికి నిదర్శనం- చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

ఇఫ్తార్ విందుతో మతసామరస్యానికి నిదర్శనం- చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
March 19, 2026 03:02 AM 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని షాది ఖానాలో బుధవారం ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య ముఖ్య అతిథులుగా హాజరై ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఉపవాస విరమణ చేశారు. అనంతరం అందరితో కలిసి భోజనం చేసి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు కార్యక్రమాలు నిలుస్తాయని, అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ ఆకులు ఇంద్రసేనారెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, ఎమ్మార్వో వీరా బాయి, మున్సిపల్ కమిషనర్ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు, ఎండి హన్ను బాయ్, ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్, కొయ్యడ శేఖర్, ఊదరి యాదయ్య, పిల్లలమరి మధుసూదన్, చింతల ఉమామహేశ్వరి, బత్తుల జయమ్మ దాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి ఖయ్యూం, బాబా షరీఫ్, రావుల స్వామి, ఎండి ఎజాస్, ముస్లిం మత పెద్దలు, మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News