Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:18 PM

ఇన్‌స్టాగ్రామ్ డీల్స్‌తో గంజాయి ట్రాఫికింగ్! 'ఏబ్లో ఎస్కోబార్' పరారీ.. నల్గొండ రూరల్ పోలీస్ మెరుపు దాడి

ఇన్‌స్టాగ్రామ్ డీల్స్‌తో గంజాయి ట్రాఫికింగ్! 'ఏబ్లో ఎస్కోబార్' పరారీ.. నల్గొండ రూరల్ పోలీస్ మెరుపు దాడి

ఇన్‌స్టాగ్రామ్ డీల్స్‌తో గంజాయి ట్రాఫికింగ్! 'ఏబ్లో ఎస్కోబార్' పరారీ.. నల్గొండ రూరల్ పోలీస్ మెరుపు దాడి
January 11, 2026 04:18 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

ఇన్‌స్టాగ్రామ్ డీల్స్‌తో గంజాయి ట్రాఫికింగ్! 'ఏబ్లో ఎస్కోబార్' పరారీ.. నల్గొండ రూరల్ పోలీస్ మెరుపు దాడి

నల్గొండజిల్లా స్థానికం ప్రతినిధి డి.డి. దాసు జనవరి 11: "ఏవూరు రా మీరంతా!" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో "పాబ్లో ఎస్కోబార్" పేరుతో గంజాయి సరఫరాదారుడితో పరిచయం.. ఒడిశా నుంచి నల్గొండకు 4.6 కిలోల గంజాయి తరలింపు! ఐటీ టవర్ సత్య టీ హబ్ దగ్గర డీల్ ప్లాన్‌ను నల్గొండ రూరల్ పోలీస్ భగ్నం చేసి ఇద్దరు యువకులను పట్టుకున్నారు.

నిందితులు పట్టుబడ్డారు:

  1. ఏ-1: సయద్ మాజిద్
  2. ఏ-2: మొహమ్మద్ సోహైల్

ఏ-3: శివారెడ్డి@ఏబ్లో ఎస్కోబార్ పరారీలో ఉన్నాడు.

స్వాధీనం చేసుకున్నాయి:

  1. 1.15 లక్షల విలువైన 4.6 కిలోల గంజాయి
  2. రెండు సెల్ ఫోన్లు

ఒడిశా నుంచి తక్కువ దానికి కొనుగోలు చేసిన యువకులు, నల్గొండ యువకులకు చిన్న ప్యాకెట్లుగా 500 రూపాయలకు అమ్మే ప్రయత్నం. నమ్మదగిన సమాచారం ఆధారంగా ఈగల్ ఫోర్స్, నల్గొండ రూరల్ పోలీస్ మెరుపు దాడి చేశారు.

డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో SI నల్గొండ రూరల్, CI నల్గొండ II టౌన్, ఈగల్ ఫోర్స్, రూరల్ సిబ్బంది అద్భుత పనితీరు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అందరినీ ప్రత్యేకంగా అభినందించారు.

ఎస్పీ హెచ్చరిక: "అమ్మినా.. వాడినా.. ఎవరైనా సరే! మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు తప్పవు." సమాచారం ఇస్తే గోప్యంగా ఉంచుతామ్ - డయల్ 100 లేదా 8712670266.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News