Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:43 PM

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతపై సమీక్ష సమావేశం

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతపై సమీక్ష సమావేశం

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతపై సమీక్ష సమావేశం
January 05, 2026 07:04 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఇంటర్మీడియట్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కళాశాల ప్రిన్సిపల్స్ కృషి చేయాలి.

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో

సోమవారం రోజు మినీ మీటింగ్ హాల్లో జిల్లా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లడుతూ ప్రభుత్వము విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తునందున అదే దిశగా ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యా బోధన చేయాలన్నారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాలలో కనీస సౌకర్యాలు లైటింగ్,బెంచీలు,ఫ్యాన్లు,మంచినీటి,తదితర సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రాక్టికల్ పరీక్షల కోసం ల్యాబ్ మెటీరియల్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున వెనకబడిన విద్యార్థులకు స్పెషల్ క్లాస్ లు ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి పాస్ అయ్యేలా చూడాలన్నారు. పిల్లలకు అర్థమయ్యేలా విద్యా బోధన చేయాలన్నారు. గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేలా కళాశాల ప్రిన్సిపల్స్ కృషి చేయాలని అన్నారు. కళాశాలలో ఏమైనా సమస్యలు,మరమ్మత్తులు ఉంటే 20 రోజుల్లో పూర్తిచేయాలని ఆర్ అండ్ బి ఇంజనీర్లను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారిని రమణి, కళాశాల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News