Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:43 AM

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతపై సమీక్ష సమావేశం

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతపై సమీక్ష సమావేశం

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతపై సమీక్ష సమావేశం
January 05, 2026 07:04 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఇంటర్మీడియట్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కళాశాల ప్రిన్సిపల్స్ కృషి చేయాలి.

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో

సోమవారం రోజు మినీ మీటింగ్ హాల్లో జిల్లా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లడుతూ ప్రభుత్వము విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తునందున అదే దిశగా ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యా బోధన చేయాలన్నారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాలలో కనీస సౌకర్యాలు లైటింగ్,బెంచీలు,ఫ్యాన్లు,మంచినీటి,తదితర సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రాక్టికల్ పరీక్షల కోసం ల్యాబ్ మెటీరియల్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున వెనకబడిన విద్యార్థులకు స్పెషల్ క్లాస్ లు ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి పాస్ అయ్యేలా చూడాలన్నారు. పిల్లలకు అర్థమయ్యేలా విద్యా బోధన చేయాలన్నారు. గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేలా కళాశాల ప్రిన్సిపల్స్ కృషి చేయాలని అన్నారు. కళాశాలలో ఏమైనా సమస్యలు,మరమ్మత్తులు ఉంటే 20 రోజుల్లో పూర్తిచేయాలని ఆర్ అండ్ బి ఇంజనీర్లను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారిని రమణి, కళాశాల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News