Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:49 PM

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతపై సమీక్ష సమావేశం

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతపై సమీక్ష సమావేశం

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతపై సమీక్ష సమావేశం
05-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఇంటర్మీడియట్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కళాశాల ప్రిన్సిపల్స్ కృషి చేయాలి.

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో

సోమవారం రోజు మినీ మీటింగ్ హాల్లో జిల్లా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లడుతూ ప్రభుత్వము విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తునందున అదే దిశగా ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యా బోధన చేయాలన్నారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాలలో కనీస సౌకర్యాలు లైటింగ్,బెంచీలు,ఫ్యాన్లు,మంచినీటి,తదితర సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రాక్టికల్ పరీక్షల కోసం ల్యాబ్ మెటీరియల్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున వెనకబడిన విద్యార్థులకు స్పెషల్ క్లాస్ లు ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి పాస్ అయ్యేలా చూడాలన్నారు. పిల్లలకు అర్థమయ్యేలా విద్యా బోధన చేయాలన్నారు. గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేలా కళాశాల ప్రిన్సిపల్స్ కృషి చేయాలని అన్నారు. కళాశాలలో ఏమైనా సమస్యలు,మరమ్మత్తులు ఉంటే 20 రోజుల్లో పూర్తిచేయాలని ఆర్ అండ్ బి ఇంజనీర్లను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారిని రమణి, కళాశాల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.

Sthanikam

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతపై సమీక్ష సమావేశం

Article Image

ఇంటర్మీడియట్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కళాశాల ప్రిన్సిపల్స్ కృషి చేయాలి.

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో

సోమవారం రోజు మినీ మీటింగ్ హాల్లో జిల్లా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లడుతూ ప్రభుత్వము విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తునందున అదే దిశగా ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యా బోధన చేయాలన్నారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాలలో కనీస సౌకర్యాలు లైటింగ్,బెంచీలు,ఫ్యాన్లు,మంచినీటి,తదితర సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రాక్టికల్ పరీక్షల కోసం ల్యాబ్ మెటీరియల్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున వెనకబడిన విద్యార్థులకు స్పెషల్ క్లాస్ లు ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి పాస్ అయ్యేలా చూడాలన్నారు. పిల్లలకు అర్థమయ్యేలా విద్యా బోధన చేయాలన్నారు. గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేలా కళాశాల ప్రిన్సిపల్స్ కృషి చేయాలని అన్నారు. కళాశాలలో ఏమైనా సమస్యలు,మరమ్మత్తులు ఉంటే 20 రోజుల్లో పూర్తిచేయాలని ఆర్ అండ్ బి ఇంజనీర్లను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారిని రమణి, కళాశాల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News