స్థానిక ప్రతినిధి
రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ BRS బలపరిచిన యువ నాయకుడు గర్దాస్ విక్రమ్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పూస బాలనరసింహపై విక్రమ్ 649 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ముందు వరకు గ్రామంలో హస్తం పార్టీదే పైచేయి అన్న అభిప్రాయం బలంగా ఉండగా, పోలింగ్ ఫలితాలు మాత్రం భిన్న చిత్రాన్ని ఆవిష్కరించాయి. యువతతో పాటు అన్ని వర్గాల మద్దతు విక్రమ్కు వెల్లువలా వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.
గ్రామాభివృద్ధి, అందుబాటులో ఉండే నాయకత్వం, స్పష్టమైన హామీలే విక్రమ్ విజయంలో కీలకంగా మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫలితం రామన్నపేట మండల రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపిందని, రానున్న రోజుల్లో మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి