Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:25 PM

ఇంద్రపాలనగరంలో BRS ఘనవిజయం.. అంచనాలకు చెక్!

ఇంద్రపాలనగరంలో BRS ఘనవిజయం.. అంచనాలకు చెక్!

ఇంద్రపాలనగరంలో BRS ఘనవిజయం.. అంచనాలకు చెక్!
December 15, 2025 03:55 PM 131 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానిక ప్రతినిధి

రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ BRS బలపరిచిన యువ నాయకుడు గర్దాస్ విక్రమ్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పూస బాలనరసింహపై విక్రమ్ 649 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

ఎన్నికల ముందు వరకు గ్రామంలో హస్తం పార్టీదే పైచేయి అన్న అభిప్రాయం బలంగా ఉండగా, పోలింగ్ ఫలితాలు మాత్రం భిన్న చిత్రాన్ని ఆవిష్కరించాయి. యువతతో పాటు అన్ని వర్గాల మద్దతు విక్రమ్‌కు వెల్లువలా వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

గ్రామాభివృద్ధి, అందుబాటులో ఉండే నాయకత్వం, స్పష్టమైన హామీలే విక్రమ్ విజయంలో కీలకంగా మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫలితం రామన్నపేట మండల రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపిందని, రానున్న రోజుల్లో మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News