Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:22 AM

ఇంద్రపాలనగరంలో BRS ఘనవిజయం.. అంచనాలకు చెక్!

ఇంద్రపాలనగరంలో BRS ఘనవిజయం.. అంచనాలకు చెక్!

ఇంద్రపాలనగరంలో BRS ఘనవిజయం.. అంచనాలకు చెక్!
December 15, 2025 03:55 PM 136 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానిక ప్రతినిధి

రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ BRS బలపరిచిన యువ నాయకుడు గర్దాస్ విక్రమ్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పూస బాలనరసింహపై విక్రమ్ 649 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

ఎన్నికల ముందు వరకు గ్రామంలో హస్తం పార్టీదే పైచేయి అన్న అభిప్రాయం బలంగా ఉండగా, పోలింగ్ ఫలితాలు మాత్రం భిన్న చిత్రాన్ని ఆవిష్కరించాయి. యువతతో పాటు అన్ని వర్గాల మద్దతు విక్రమ్‌కు వెల్లువలా వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

గ్రామాభివృద్ధి, అందుబాటులో ఉండే నాయకత్వం, స్పష్టమైన హామీలే విక్రమ్ విజయంలో కీలకంగా మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫలితం రామన్నపేట మండల రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపిందని, రానున్న రోజుల్లో మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News