ఇల్లెందులో చరిత్రాత్మక బీసీ సంక్షేమ జేఏసీ మహాసభ
ఇల్లెందులో చరిత్రాత్మక బీసీ సంక్షేమ జేఏసీ మహాసభ
Editor Desk
ఇల్లెందులో చరిత్రాత్మక బీసీ సంక్షేమ జేఏసీ మహాసభ
స్థానిక ప్రతినిధి రామన్నపేట కొండ మల్లేశం గౌడ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో శనివారం నిర్వహించిన అతి భారీ బీసీ సంక్షేమ జేఏసీ సమావేశం జిల్లాలోనే చరిత్రాత్మకంగా నిలిచింది. పట్టణ నలుమూలల నుంచి వందలాది బీసీ సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఈ సభకు తరలివచ్చారు.
ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ జేఏసీ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇల్లెందు పట్టణానికి చెందిన మడత వెంకట్ గౌడ్ను రాష్ట్ర బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనకు సభలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జాతీయ జేఏసీ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, రెండు జిల్లాల ఇన్చార్జి రాష్ట్ర కార్యదర్శి బుర్ర సోమేశ్వర్ గౌడ్ హాజరయ్యారు.
అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పామర్తి అక్కినేడు ప్రసాద్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మధు గౌడ్, మహిళా నాయకురాలు కుదుపాక మీనాక్షి, మణుగూరు మండల బీసీ సంఘం అధ్యక్షురాలు బాచెట్టి కవిత, కాంగ్రెస్ మండల నాయకురాలు సౌజన్య, ముత్యం రమేష్, పొదిల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి