Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:08 AM

ఇల్లెందులో చరిత్రాత్మక బీసీ సంక్షేమ జేఏసీ మహాసభ

ఇల్లెందులో చరిత్రాత్మక బీసీ సంక్షేమ జేఏసీ మహాసభ

ఇల్లెందులో చరిత్రాత్మక బీసీ సంక్షేమ జేఏసీ మహాసభ
December 21, 2025 01:53 PM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇల్లెందులో చరిత్రాత్మక బీసీ సంక్షేమ జేఏసీ మహాసభ

స్థానిక ప్రతినిధి రామన్నపేట కొండ మల్లేశం గౌడ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో శనివారం నిర్వహించిన అతి భారీ బీసీ సంక్షేమ జేఏసీ సమావేశం జిల్లాలోనే చరిత్రాత్మకంగా నిలిచింది. పట్టణ నలుమూలల నుంచి వందలాది బీసీ సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఈ సభకు తరలివచ్చారు.

ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ జేఏసీ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇల్లెందు పట్టణానికి చెందిన మడత వెంకట్ గౌడ్‌ను రాష్ట్ర బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనకు సభలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జాతీయ జేఏసీ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, రెండు జిల్లాల ఇన్‌చార్జి రాష్ట్ర కార్యదర్శి బుర్ర సోమేశ్వర్ గౌడ్ హాజరయ్యారు.

అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పామర్తి అక్కినేడు ప్రసాద్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మధు గౌడ్, మహిళా నాయకురాలు కుదుపాక మీనాక్షి, మణుగూరు మండల బీసీ సంఘం అధ్యక్షురాలు బాచెట్టి కవిత, కాంగ్రెస్ మండల నాయకురాలు సౌజన్య, ముత్యం రమేష్, పొదిల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News