Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:38 AM

ఇల్లెందులో చరిత్రాత్మక బీసీ సంక్షేమ జేఏసీ మహాసభ

ఇల్లెందులో చరిత్రాత్మక బీసీ సంక్షేమ జేఏసీ మహాసభ

ఇల్లెందులో చరిత్రాత్మక బీసీ సంక్షేమ జేఏసీ మహాసభ
December 21, 2025 01:53 PM 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇల్లెందులో చరిత్రాత్మక బీసీ సంక్షేమ జేఏసీ మహాసభ

స్థానిక ప్రతినిధి రామన్నపేట కొండ మల్లేశం గౌడ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో శనివారం నిర్వహించిన అతి భారీ బీసీ సంక్షేమ జేఏసీ సమావేశం జిల్లాలోనే చరిత్రాత్మకంగా నిలిచింది. పట్టణ నలుమూలల నుంచి వందలాది బీసీ సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఈ సభకు తరలివచ్చారు.

ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ జేఏసీ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇల్లెందు పట్టణానికి చెందిన మడత వెంకట్ గౌడ్‌ను రాష్ట్ర బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనకు సభలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జాతీయ జేఏసీ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, రెండు జిల్లాల ఇన్‌చార్జి రాష్ట్ర కార్యదర్శి బుర్ర సోమేశ్వర్ గౌడ్ హాజరయ్యారు.

అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పామర్తి అక్కినేడు ప్రసాద్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మధు గౌడ్, మహిళా నాయకురాలు కుదుపాక మీనాక్షి, మణుగూరు మండల బీసీ సంఘం అధ్యక్షురాలు బాచెట్టి కవిత, కాంగ్రెస్ మండల నాయకురాలు సౌజన్య, ముత్యం రమేష్, పొదిల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News