Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:32 PM

ఇల్లెందులో చరిత్రాత్మక బీసీ సంక్షేమ జేఏసీ మహాసభ

ఇల్లెందులో చరిత్రాత్మక బీసీ సంక్షేమ జేఏసీ మహాసభ

ఇల్లెందులో చరిత్రాత్మక బీసీ సంక్షేమ జేఏసీ మహాసభ
December 21, 2025 01:53 PM 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇల్లెందులో చరిత్రాత్మక బీసీ సంక్షేమ జేఏసీ మహాసభ

స్థానిక ప్రతినిధి రామన్నపేట కొండ మల్లేశం గౌడ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో శనివారం నిర్వహించిన అతి భారీ బీసీ సంక్షేమ జేఏసీ సమావేశం జిల్లాలోనే చరిత్రాత్మకంగా నిలిచింది. పట్టణ నలుమూలల నుంచి వందలాది బీసీ సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఈ సభకు తరలివచ్చారు.

ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ జేఏసీ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇల్లెందు పట్టణానికి చెందిన మడత వెంకట్ గౌడ్‌ను రాష్ట్ర బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనకు సభలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జాతీయ జేఏసీ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, రెండు జిల్లాల ఇన్‌చార్జి రాష్ట్ర కార్యదర్శి బుర్ర సోమేశ్వర్ గౌడ్ హాజరయ్యారు.

అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పామర్తి అక్కినేడు ప్రసాద్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మధు గౌడ్, మహిళా నాయకురాలు కుదుపాక మీనాక్షి, మణుగూరు మండల బీసీ సంఘం అధ్యక్షురాలు బాచెట్టి కవిత, కాంగ్రెస్ మండల నాయకురాలు సౌజన్య, ముత్యం రమేష్, పొదిల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News