PRINT TIME: April 11, 2026 01:59 AM
ఇంజ నర్సయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
ఇంజ నర్సయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
January 10, 2026 01:53 AM
53 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
ఇంజ మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఉచిత వైద్య పరీక్షలు
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్
రాజపేట:మండల పరిధిలోని కాల్వపల్లి గ్రామంలో ఇంజ నర్సయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేనోవో క్యాన్సర్ ఆస్పత్రికి చెందిన ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇంజ మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమని,గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులపై ముందస్తు పరీక్షలు,అవగాహన చాలా అవసరమని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు,వైద్యులు,ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి