ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు పరిశీలించిన జిల్లా కలెక్టర్
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు పరిశీలించిన జిల్లా కలెక్టర్
Sthanikam District Staff Reporter
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు పరిశీలించిన జిల్లా కలెక్టర్.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామంలో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని, వాటిలో ఎన్ని ఇండ్లు నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. వివిధ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు చేపట్టాలన్నారు.అదే విధంగా పూర్తి చేసిన వెంటనే డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయన్నారు. రెండో విడతలో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీ గ్రామంలో ఇప్పటి వరకు మంజూరు అయినంత వరకు ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేస్తే కొత్త ఇండ్లు మంజూరు అవుతాయని తెలిపారు.మిగిలిన ఇండ్లను త్వరగా పూర్తి చేసేలా చూడాలని పంచాయతీ కార్యదర్శిలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి