PRINT TIME: May 12, 2026 06:37 PM
ఇందిరమ్మ ఇంటి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న: మున్సిపల్ చైర్మన్
ఇందిరమ్మ ఇంటి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న: మున్సిపల్ చైర్మన్
May 12, 2026 05:16 PM
26 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో రిజ్వనా భర్త సాదిక్ ఇందిరమ్మ ఇంటి భూమి పూజ కార్యక్రమం నిర్వహించగా,మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తై కుటుంబ సభ్యులు ఆనందంగా జీవించాలని శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు అందేలా మున్సిపాలిటీ కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల్ కాంగ్రెస్ అధ్యక్షులు తాహిర్ అలీ, బీసీ సెల్ అధ్యక్షులు సాయిలు పటేల్, మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, మహేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి