ఇందిరమ్మ ఇల్లు హామీ పత్రం అందజేత: పేదల గృహ కలను సాకారం చేస్తున్న ప్రభుత్వం
ఇందిరమ్మ ఇల్లు హామీ పత్రం అందజేత: పేదల గృహ కలను సాకారం చేస్తున్న ప్రభుత్వం
K.RAVI
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో లబ్ధిదారికి మంజూరు
రెండో వార్డులో లబ్ధిదారిణి రేణుకకు హామీ పత్రం అందజేత
చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తాళ్లసింగారం గ్రామం రెండో వార్డులో శుక్రవారం ఇందిరమ్మ ఇల్లు హామీ పత్రం అందజేయడం జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారిణి దొనకొండ రేణుక కు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్ చేతుల మీదుగా హామీ పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సుర్వి నరసింహ గౌడ్ మాట్లాడుతూ.. పేదలందరికీ గృహ సదుపాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు దొనకొండ కృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎస్సీ సెల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఊదరి నరసింహ, మాజీ ఎంపీటీసీ మండారి మార్కు, మాజీ వార్డ్ మెంబర్ ఉడతల నరసింహ గౌడ్, దొనకొండ బాలయ్య, సర్పెళ్లి మారయ్య, మారుపాక ప్రభాకర్ గౌడ్, దొనకొండ శంకర్, సుక్క నరసింహ, దొనకొండ పాపయ్య, దొనకొండ చందు, మాజీ ఉపసర్పంచ్ ఉదరి మారయ్య, దొనకొండ పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి