ఇందిరమ్మ ఇళ్లతో పేదల జీవితాల్లో వెలుగులు
ఇందిరమ్మ ఇళ్లతో పేదల జీవితాల్లో వెలుగులు
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి, గుండ్రాంపల్లి గ్రామాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహప్రవేశాలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారుల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందమే పథకం విజయానికి నిదర్శనమని తెలిపారు. పేదలకు గౌరవప్రదమైన జీవనం కల్పించడం, సామాజిక సమానత్వాన్ని సాధించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కేవలం నివాసం కల్పించడం మాత్రమే కాకుండా గ్రామీణాభివృద్ధికి దోహదపడే కీలక చర్య అని వివరించారు.ప్రతి అర్హుడైన నిరుపేదకు సొంత ఇల్లు అందే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కొత్త ఇళ్లలోకి ప్రవేశించిన లబ్ధిదారుల ఇళ్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. “సొంత ఇల్లు మా జీవితకాల స్వప్నం. ఇందిరమ్మ పథకం ద్వారా అది నెరవేరింది” అంటూ లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో చిట్యాల ఇన్చార్జ్ ఎంఆర్ఓ విజయలక్ష్మి, ఎంపీడీవో జయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాణ్యతతో గృహాల నిర్మాణం పూర్తి చేసినందుకు కలెక్టర్ అధికారులను అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి