ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ శ్రీకారం చుట్టిన మున్సిపల్ చైర్మన్
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ శ్రీకారం చుట్టిన మున్సిపల్ చైర్మన్
Krishna
నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని 8వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా గులాన్ కృష్ణవేణి, పైడిపల్లి సాయమ్మ, కర్కాని నాగమణి ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగేష్ కూమార్ షేట్కార్,పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్,వార్డు ప్రజాప్రతినిధి సురేఖ విట్టల్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని పేద కుటుంబాలకు స్వంత ఇల్లు కల కలగజేయాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని పేద కుటుంబాలకు స్వంత ఇల్లు కల కలగజేయాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి