Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:54 AM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి. వాసలమర్రిలో పురోగతిని పరిశీలించిన కలెక్టర్ అనురాగ్ జయంతి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి. వాసలమర్రిలో పురోగతిని పరిశీలించిన కలెక్టర్ అనురాగ్ జయంతి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.  వాసలమర్రిలో పురోగతిని పరిశీలించిన కలెక్టర్ అనురాగ్ జయంతి
08-06-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తుర్కపల్లి మండలం వాసలమర్రి గ్రామంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం పురోగతిని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల సంఖ్య, పూర్తయిన ఇళ్లు, నిర్మాణ దశలో ఉన్న ఇళ్లు, ఇంకా ప్రారంభం కాని ఇళ్ల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంజూరైన ప్రతి ఇల్లు నిర్దేశిత గడువులోగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లను సందర్శించిన కలెక్టర్, వారితో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గృహ నిర్మాణం ప్రారంభించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు.

గ్రామంలో ఇంకా ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన కుటుంబాల సంఖ్య, ఎల్-2 కేటగిరీలో ఉన్న లబ్ధిదారుల వివరాలు, గృహ నిర్మాణానికి వారి సంసిద్ధతపై సమాచారం సేకరించి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి. వాసలమర్రిలో పురోగతిని పరిశీలించిన కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

తుర్కపల్లి మండలం వాసలమర్రి గ్రామంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం పురోగతిని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల సంఖ్య, పూర్తయిన ఇళ్లు, నిర్మాణ దశలో ఉన్న ఇళ్లు, ఇంకా ప్రారంభం కాని ఇళ్ల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంజూరైన ప్రతి ఇల్లు నిర్దేశిత గడువులోగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లను సందర్శించిన కలెక్టర్, వారితో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గృహ నిర్మాణం ప్రారంభించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు.

గ్రామంలో ఇంకా ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన కుటుంబాల సంఖ్య, ఎల్-2 కేటగిరీలో ఉన్న లబ్ధిదారుల వివరాలు, గృహ నిర్మాణానికి వారి సంసిద్ధతపై సమాచారం సేకరించి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News