Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:43 AM

ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు పంపిణీ

ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు పంపిణీ

ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు పంపిణీ
January 11, 2026 06:08 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మోటకొండూరు:స్థానికం రిపోర్టర్ జి.శ్రీనివాస్

మోటకొండూరు మధిర రాయికుంట పల్లి 12వ వార్డులో మహిళా సంఘం అధ్యక్షురాలు జంపాల నిర్మల, విఓఏ వట్టిపెల్లి మాధవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అక్కా, చెల్లెళ్లకు రేవంతన్న కానుకగా మహిళా ఉన్నతి- తెలంగాణ ప్రగతి అనే విధంగా చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం 12వ వార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ భూమoడ్ల జయమ్మ శ్రీనివాస్,12వ వార్డు సభ్యులు జూకంటి మధు పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేసి అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంతన్న ప్రజాపాలన ద్వారా మహిళలకు పెద్దపీట వేస్తుందని మహిళలకు భరోసా కల్పిస్తున్నారని, మహిళా సంఘాల అభివృద్ధికి తోడ్పడుతున్నారని, మహిళలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని,మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలని తెలిపారు, అదేవిధంగా అమ్మకు అక్షరమాల (Ullas Books) అనే కార్యక్రమంలో భాగంగా (Books Distribution) చేసి ప్రతి మహిళ కూడా తప్పకుండా చదువుకోవాలని చదువు ప్రతి ఒక్కరికి అవసరమని అన్నారు. ఈ పుస్తకాలను వాళ్లకు మహిళలకు పంపిణీ చేశారు.ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు సర్పంచ్,పాలకవర్గానికి గ్రామ ప్రజలు మహిళలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వo రేవంత్ అన్న ప్రజాపాలనకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్యకి సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్,మహిళల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు,భవిష్యత్తులో ప్రజల కోసం ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News