ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు పంపిణీ
ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు పంపిణీ
Sthanikam District Staff Reporter
మోటకొండూరు:స్థానికం రిపోర్టర్ జి.శ్రీనివాస్
మోటకొండూరు మధిర రాయికుంట పల్లి 12వ వార్డులో మహిళా సంఘం అధ్యక్షురాలు జంపాల నిర్మల, విఓఏ వట్టిపెల్లి మాధవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అక్కా, చెల్లెళ్లకు రేవంతన్న కానుకగా మహిళా ఉన్నతి- తెలంగాణ ప్రగతి అనే విధంగా చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం 12వ వార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ భూమoడ్ల జయమ్మ శ్రీనివాస్,12వ వార్డు సభ్యులు జూకంటి మధు పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేసి అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంతన్న ప్రజాపాలన ద్వారా మహిళలకు పెద్దపీట వేస్తుందని మహిళలకు భరోసా కల్పిస్తున్నారని, మహిళా సంఘాల అభివృద్ధికి తోడ్పడుతున్నారని, మహిళలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని,మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలని తెలిపారు, అదేవిధంగా అమ్మకు అక్షరమాల (Ullas Books) అనే కార్యక్రమంలో భాగంగా (Books Distribution) చేసి ప్రతి మహిళ కూడా తప్పకుండా చదువుకోవాలని చదువు ప్రతి ఒక్కరికి అవసరమని అన్నారు. ఈ పుస్తకాలను వాళ్లకు మహిళలకు పంపిణీ చేశారు.ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు సర్పంచ్,పాలకవర్గానికి గ్రామ ప్రజలు మహిళలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వo రేవంత్ అన్న ప్రజాపాలనకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్యకి సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్,మహిళల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు,భవిష్యత్తులో ప్రజల కోసం ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి