Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:57 AM

ఇంధన ధరల పెంపుపై సీపీఎం నిరసన. ఎర్రుపాలెంలో కేంద్ర దిష్టిబొమ్మ దహనం

ఇంధన ధరల పెంపుపై సీపీఎం నిరసన. ఎర్రుపాలెంలో కేంద్ర దిష్టిబొమ్మ దహనం

ఇంధన ధరల పెంపుపై సీపీఎం నిరసన. ఎర్రుపాలెంలో కేంద్ర దిష్టిబొమ్మ దహనం
18-05-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎర్రుపాలెం, : పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని సీపీఎం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు విమర్శించారు. పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

సోమవారం మండల కేంద్రంలోని రింగ్‌ సెంటర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్‌, ఇంధన ధరల పెరుగుదలతో పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు.

ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాక కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాన్ని మోపిందని ఆరోపించారు.

పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని చేస్తున్న సూచనలు ప్రజల ఇబ్బందులను పట్టించుకోనట్టేనని విమర్శించారు. పెరిగిన ధరలను భరించాలంటూ ప్రజలకు సూచించడం సరైన విధానం కాదన్నారు.

కార్యక్రమంలో గామాసు జోగయ్య, ఆంగోతు వెంకటేశ్వర్లు, నాగులవంచ వెంకట్రామయ్య, షేక్ లాలా, కన్నెబోయిన శ్రీను, దేవరకొండ రామకృష్ణ, షేక్ మస్తాన్, నక్క పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంధన ధరల పెంపుపై సీపీఎం నిరసన. ఎర్రుపాలెంలో కేంద్ర దిష్టిబొమ్మ దహనం

Article Image

ఎర్రుపాలెం, : పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని సీపీఎం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు విమర్శించారు. పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

సోమవారం మండల కేంద్రంలోని రింగ్‌ సెంటర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్‌, ఇంధన ధరల పెరుగుదలతో పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు.

ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాక కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాన్ని మోపిందని ఆరోపించారు.

పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని చేస్తున్న సూచనలు ప్రజల ఇబ్బందులను పట్టించుకోనట్టేనని విమర్శించారు. పెరిగిన ధరలను భరించాలంటూ ప్రజలకు సూచించడం సరైన విధానం కాదన్నారు.

కార్యక్రమంలో గామాసు జోగయ్య, ఆంగోతు వెంకటేశ్వర్లు, నాగులవంచ వెంకట్రామయ్య, షేక్ లాలా, కన్నెబోయిన శ్రీను, దేవరకొండ రామకృష్ణ, షేక్ మస్తాన్, నక్క పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News