ఇంధన ధరల పెంపుపై సీపీఎం నిరసన. ఎర్రుపాలెంలో కేంద్ర దిష్టిబొమ్మ దహనం
ఇంధన ధరల పెంపుపై సీపీఎం నిరసన. ఎర్రుపాలెంలో కేంద్ర దిష్టిబొమ్మ దహనం
Editor Desk
ఎర్రుపాలెం, : పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని సీపీఎం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు విమర్శించారు. పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
సోమవారం మండల కేంద్రంలోని రింగ్ సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్, ఇంధన ధరల పెరుగుదలతో పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు.
ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాక కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాన్ని మోపిందని ఆరోపించారు.
పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని చేస్తున్న సూచనలు ప్రజల ఇబ్బందులను పట్టించుకోనట్టేనని విమర్శించారు. పెరిగిన ధరలను భరించాలంటూ ప్రజలకు సూచించడం సరైన విధానం కాదన్నారు.
కార్యక్రమంలో గామాసు జోగయ్య, ఆంగోతు వెంకటేశ్వర్లు, నాగులవంచ వెంకట్రామయ్య, షేక్ లాలా, కన్నెబోయిన శ్రీను, దేవరకొండ రామకృష్ణ, షేక్ మస్తాన్, నక్క పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి