Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Lecture on AI Tools for Report Preparation Held at GDC Hayathnagar స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ லஞ்ச் பாக்ஸுடன் செயலகத்திற்கு முதல்வர் விஜய்.. சாதாரண ஊழியரைப் போல புதிய பணிமுறை ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్ సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 16, 2026 06:33 PM

ఇంధన ధరల పెంపుపై సీపీఐ నిరసన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి.

ఇంధన ధరల పెంపుపై సీపీఐ నిరసన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి.

ఇంధన ధరల పెంపుపై సీపీఐ నిరసన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి.
May 16, 2026 05:28 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, పెంచిన పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తిమ్మారెడ్డి బస్టాండ్ సర్కిల్ వద్ద పెద్దఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.

సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి రమేష్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. సుదర్శన్, డీహెచ్‌పీఎస్ జిల్లా నాయకులు విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎలాంటి చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు.

పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14, గ్యాస్ ధరపై రూ.2 పెంచడం వల్ల అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర భారం పడుతోందన్నారు. కష్టపడి పనిచేసినా కడుపునిండని నిరుపేదలపై కేంద్ర ప్రభుత్వం మరింత భారం మోపుతోందని ఆరోపించారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్, కె. లింగప్ప, వైటీ వీరవరప్రసాద్, ఎం. పరశురాం, ఉరుకుందు నాయకులు వైటీ ఆది, రామాంజనేయులు, అంజి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News