Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:12 AM

ఇంధన ధరల పెంపుపై సీపీఐ నిరసన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి.

ఇంధన ధరల పెంపుపై సీపీఐ నిరసన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి.

ఇంధన ధరల పెంపుపై సీపీఐ నిరసన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి.
16-05-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, పెంచిన పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తిమ్మారెడ్డి బస్టాండ్ సర్కిల్ వద్ద పెద్దఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.

సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి రమేష్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. సుదర్శన్, డీహెచ్‌పీఎస్ జిల్లా నాయకులు విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎలాంటి చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు.

పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14, గ్యాస్ ధరపై రూ.2 పెంచడం వల్ల అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర భారం పడుతోందన్నారు. కష్టపడి పనిచేసినా కడుపునిండని నిరుపేదలపై కేంద్ర ప్రభుత్వం మరింత భారం మోపుతోందని ఆరోపించారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్, కె. లింగప్ప, వైటీ వీరవరప్రసాద్, ఎం. పరశురాం, ఉరుకుందు నాయకులు వైటీ ఆది, రామాంజనేయులు, అంజి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంధన ధరల పెంపుపై సీపీఐ నిరసన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి.

Article Image

ఆదోని, పెంచిన పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తిమ్మారెడ్డి బస్టాండ్ సర్కిల్ వద్ద పెద్దఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.

సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి రమేష్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. సుదర్శన్, డీహెచ్‌పీఎస్ జిల్లా నాయకులు విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎలాంటి చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు.

పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14, గ్యాస్ ధరపై రూ.2 పెంచడం వల్ల అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర భారం పడుతోందన్నారు. కష్టపడి పనిచేసినా కడుపునిండని నిరుపేదలపై కేంద్ర ప్రభుత్వం మరింత భారం మోపుతోందని ఆరోపించారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్, కె. లింగప్ప, వైటీ వీరవరప్రసాద్, ఎం. పరశురాం, ఉరుకుందు నాయకులు వైటీ ఆది, రామాంజనేయులు, అంజి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News