ఇంధన ధరల పెంపుపై సీపీఐ నిరసన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి.
ఇంధన ధరల పెంపుపై సీపీఐ నిరసన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి.
Editor Desk
ఆదోని, పెంచిన పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తిమ్మారెడ్డి బస్టాండ్ సర్కిల్ వద్ద పెద్దఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.
సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి రమేష్కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. సుదర్శన్, డీహెచ్పీఎస్ జిల్లా నాయకులు విజయ్కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎలాంటి చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు.
పెట్రోల్పై రూ.3.29, డీజిల్పై రూ.3.14, గ్యాస్ ధరపై రూ.2 పెంచడం వల్ల అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర భారం పడుతోందన్నారు. కష్టపడి పనిచేసినా కడుపునిండని నిరుపేదలపై కేంద్ర ప్రభుత్వం మరింత భారం మోపుతోందని ఆరోపించారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్, కె. లింగప్ప, వైటీ వీరవరప్రసాద్, ఎం. పరశురాం, ఉరుకుందు నాయకులు వైటీ ఆది, రామాంజనేయులు, అంజి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి