Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Lecture on AI Tools for Report Preparation Held at GDC Hayathnagar స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ லஞ்ச் பாக்ஸுடன் செயலகத்திற்கு முதல்வர் விஜய்.. சாதாரண ஊழியரைப் போல புதிய பணிமுறை ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్ సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 16, 2026 06:35 PM

ఇంధన ధరల పెంపు ఉపసంహరించాలి జీఎస్టీ పరిధిలోకి తేవాలి. సీపీఎం

ఇంధన ధరల పెంపు ఉపసంహరించాలి జీఎస్టీ పరిధిలోకి తేవాలి. సీపీఎం

ఇంధన ధరల పెంపు ఉపసంహరించాలి జీఎస్టీ పరిధిలోకి తేవాలి. సీపీఎం
May 16, 2026 05:26 PM 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి టౌన్, : పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకొని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సీపీఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ డిమాండ్ చేశారు. సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని రైతుబజార్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే యుద్ధ పరిస్థితుల పేరుతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, సామాన్యులు, ఉద్యోగులు, పేదలపై తీవ్ర భారం పడుతోందన్నారు. రోజువారీ కూలీలు, ఉద్యోగుల జీతాలు పెరగని పరిస్థితిలో ఇంధన ధరల పెంపు ప్రజల నడ్డి విరిచేలా ఉందని విమర్శించారు.

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఇతర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాక పది రోజుల్లోనే ధరలు పెంచడం ప్రజలను మభ్యపెట్టడమేనని ఆరోపించారు. పెంచిన ధరలు ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యవర్గ సభ్యులు బందల ఎల్లయ్య, వనం రాజు, కమిటీ సభ్యులు వల్లాస్ అంజయ్య, చింతల శివ, ఈర్ల రాహుల్, జూకంటి పావుల్, జగ్గులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News