ఇంద్రపాలనగరంలో ధాతల సహాయం మరువలేనిదని ప్రశంసించిన సర్పంచ్ విక్రమ్
ఇంద్రపాలనగరంలో ధాతల సహాయం మరువలేనిదని ప్రశంసించిన సర్పంచ్ విక్రమ్
స్థానికం బృందం
ఇంద్రపాలనగరంలో గ్రామ అభివృద్ధికి అందుతున్న ధాతల సహాయం మరువలేనిదని గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ అన్నారు. సర్పంచ్ కోరిక మేరకు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు రాస వెంకటేశం తన తల్లిదండ్రులు రాస పోచమ్మ, వీరయ్య జ్ఞాపకార్థం గ్రామపంచాయతీకి సుమారు రూ.5 వేల విలువైన ఛత్రంజి (మ్యాట్) అందజేశారు.గ్రామపంచాయతీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందించిన ఈ సహకారం అభినందనీయమని సర్పంచ్ విక్రమ్ తెలిపారు. గ్రామాభివృద్ధిలో భాగంగా ముందుకు వచ్చి సహకరిస్తున్న ధాతలనుగ్రామస్తులు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యుడు వరికుప్పల స్వామి, పంచాయతీ సిబ్బంది ఎండీ అమినొద్దిన్, మంటి అంజయ్య, నాగరాజు, ఈర్లపల్లి మల్లయ్య, మందడి విద్యాసాగర్ రెడ్డి, సింగణబోయిన జంగయ్య, సింగణబోయిన గణేష్, మందడి శ్రీధర్ రెడ్డి, మంటి లింగస్వామి, రవ్వ నర్సింహా, గర్ధాస్ కరుణాకర్, కొమ్మగోని సంజీవ, గర్ధాస్ దాశరద, మల్లం శ్రీరాములు, గర్ధాస్ పాండరి, గర్ధాస్ శ్రీకాంత్, సింగణబోయిన ఆంజనేయులు, గర్ధాస్ సతీష్, గర్ధాస్ మహేష్, రాధారపు నర్సింహా, శ్రీరామ్ సంతోష్, భోదాస్ నరేష్, భోదాస్ రవి, బోనగిరి మహేష్, బోనగిరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.గ్రామాభివృద్ధికి ఇలాంటి సహకారం కొనసాగాలని సర్పంచ్ విక్రమ్ ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి